కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్న కార్పోరేట్ సంస్ధలపై సుప్రీంకోర్టు మరోసారి కనికరం చూపింది. పూర్తి జీతాలు ఇవ్వకపోయినా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేందుకు వీలు లేకుండా గతంలో ఇచ్చిన ఆదేశాలను మరోసారి పొడిగిస్తూ తాజాగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అదే సమయంలో చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని ఉద్యోగులతో పాటు సంస్ధల యాజమాన్యాలకు సూచించింది.

జూలై వరకూ పొడిగింపు
లాక్ డౌన్ సమయంలో ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తూ కార్పోరేట్ సంస్ధలు తీసుకుంటున్న నిర్ణయాలపై గతంలో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... అలాంటి సంస్ధలపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ సందర్భంగా ఉద్యోగులపై మానవత్వం ప్రదర్శించాలని, వారికి పూర్తి జీతాలు ఇవ్వాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై ఈ పిటిషన్ దాఖలైంది. దీంతో ప్రభుత్వాలు కార్పోరేట్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు మే 25న ఆదేశాలు ఇచ్చింది. గతంలో వీటిని ఓ సారి పొడిగించగా.. తాజాగా మరోసారి జూలై నెలాఖరు వరకూ పొడిగిస్తూ సుప్రింకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

మీరే మాట్లాడుకోండి
కార్పోరేట్, ప్రైవేట్ సంస్ధల యాజమాన్యాలు, వారి ఉద్యోగులు చర్చించుకుని ఈ వ్యవహారంలో ఓ పరిష్కారం కనుగొనాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. వేతనాలతో సంబంధం లేకుండా పనిచేసేందుకు సిద్ధంగా ఉండే ఉద్యోగులను పనిలోకి అనుమతించాలని ధర్మాసనం సూచించింది. ప్రభుత్వాలు కూడా ఇలాంటి చర్చలను ప్రోత్సహించాలని, అంతిమంగా వాటి ఫలితాలను లేబర్ కమిషనర్ కు నివేదించాలని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో తెలిపింది.

కేంద్రం ఉత్తర్వుల చట్టబద్ధత...
లాక్ డౌన్ సందర్భంగా ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వని సంస్ధలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాలకు వీలు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ మార్చి 29న జారీ చేసిన ఉత్తర్వుల చట్టబద్ధతపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు తాజా ఆదేశాల్లో సూచించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను కూడా జూలై చివరి వారానికి ధర్మాసనం వాయిదా వేసింది. అయితే విచారణ సందర్భంగా స్పందించిన కేంద్రం తరఫు న్యాయవాది మార్చి 29న ఇచ్చిన ఉత్తర్వులు కేవలం లాక్ డౌన్ కాలానికే పరిమితమని, ఈ సమయంలో ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించలేక పోతే దానికి గల కారణాలు తెలుసుకునేందుకు సంస్ధల ఖాతాల ఆడిట్ చేస్తామని తెలిపింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications