ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 31 శాతం క్షీణత
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-ఆగస్ట్ కాలంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 31 శాతం మేర క్షీణించాయి. రూ.1,92,718 కోట్లకు క్షీణించాయి. ఇదే సమయంలో నికర పరోక్ష పన్నుల వసూళ్లు పదకొండు శాతం తగ్గి రూ.3,42,591 కోట్లుగా నమోదయ్యాయని లోకసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.
గత ఏడాది (2018-19) ఏప్రిల్-ఆగస్ట్లో నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.2,79,711 కోట్లుగా నమోదు నమోదయింది. నికర పరోక్ష పన్నుల వసూళ్లు రూ.3,85,499 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్ట్లో కేంద్ర జీఎస్టీ వసూళ్లు రూ.1.81 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కేంద్ర జీఎస్టీ వసూళ్లను రూ.6,90,500 కోట్లుగా బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. జీఎస్టీ వసూళ్లు, ప్రత్యక్ష పన్ను వసూళ్లు అన్నీ పడిపోయాయి. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ర్యకలాపాలు పూర్తిగా నిలిచి అన్ని రకాల ట్యాక్స్లు తగ్గిన విషయం తెలిసిందే.