అమెరికాలోని తమ నలభై వేలమంది క్లయింట్ సర్వీస్ ఉద్యోగులను శాశ్వతంగా ఇంటి నుండి పని చేసేందుకు అనుమతించినట్లు అకౌంటింగ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ PwC తెలిపింది. డెలాయిట్, కేపీఎంజీ వంటి ప్రధాన అకౌంటింగ్ సంస్థలు కరోనా సమయంలో ఇంటి నుండి పని చేసే అవకాశాన్ని ఉద్యోగులకు ఇచ్చాయి. అకౌంటింగ్ ఇండస్ట్రీలో క్లయింట్ సర్వీస్ ఉద్యోగులు పూర్తిగా ఇంటి వద్ద నుండి పని చేసేందుకు అవకాశం కల్పించిన తొలి సంస్థ PwC. ఈ మేరకు PwC డిప్యూటీ పీపుల్ లీడర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఎంచుకున్న ఉద్యోగులు వారంలో గరిష్ఠంగా మూడు రోజులు కార్యాలయానికి రావలసి ఉంటుంది. క్లయింట్స్తో ఇన్-పర్సన్ ఇంటర్వ్యూ, కీలక టీమ్ మీటింగ్స్, క్లయింట్ విజిట్స్, లర్నింగ్ సెషన్స్కు హాజరు కావాలని చెబుతున్నారు. అయితే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఎంచుకున్న ఉద్యోగుల వేతనాల్లో కోత ఉంటుందని, వారి నివాస ప్రాంతాన్ని బట్టి ఈ వేతన కోత ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

అయితే కరోనా మహమ్మారికి ముందు కంపెనీకి చెందిన ఏడువేల మంది ఉద్యోగులు వర్చువల్గా వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, అమెరికాలో చేసిన PwC సర్వేలో ఆసక్తికర అంశం వెల్లడైంది. 65 శాతం మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారు. అందులో 88 శాతం మంది హయ్యర్ పదోన్నతి కోసం చూస్తున్నారు. రానున్న అయిదేళ్ల కాలంలో లక్షమంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు PwC ఇటీవల తెలిపింది.
ఇదిలా ఉండగా, అల్ఫాబెట్ ఇంక్ గూగుల్ కూడా శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఎంచుకున్న ఉద్యోగుల నివాస ప్రాంతాన్ని బట్టి వేతనాలు తగ్గిస్తోంది. గత ఏడాది మార్చి నుండి కరోనా నుండి బయటపడేందుకు అమెరికాలోని కంపెనీల్లోని ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ సేవలు అందిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications