వారెన్ బఫెట్ను దాటేసి.. ప్రపంచ 7వ కుబేరుడిగా ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరో ఘనత సాధించారు. భారత, ఆసియా కుబేరుడు అయిన ఈయన తాజాగా వారెన్ బఫెట్ను దాటేసి, ప్రపంచ ఏడో కుబేరుడిగా నిలిచారు. ఇప్పుడు బఫెట్ కంటే అత్యంత సంపన్నుడు రిలయన్స్ అధినేత. ఈయన ఆస్తులు 68.3 బిలియన్ డాలర్లు కాగా, వారెన్ బఫెట్ ఆస్తులు 67.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
గోడకు కొట్టిన బంతిలా.. భారత్ అదుర్స్! గుడ్న్యూస్ చెప్పిన ఆర్థికవేత్త
ఈ మేరకు బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2020 జాబితాను విడుదల చేసింది. రిలయన్స్ డిజిటల్ విభాగం జియో ప్లాట్ఫాంలోకి ఇటీవల పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా యూకే బీపీతోను జాయింట్ వెంచర్ ప్రారంభించింది. దీంతో టాప్ 10 ఏకైక ఆసియావాసుల్లో అంబానీ నిలిచారు.
బెర్క్షైర్ హాత్వే చైర్మన్, సీఈవో వారెన్ బఫెట్ ఇటీవల 37 బిలియన్ డాలర్లకు పైగా షేర్లను విరాళంగా ఇచ్చారు. దీంతో ఆయన సంపద తగ్గింది. ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా పేరొందిన బఫెట్ ఈ వారంలో 2.9 బిలియన్ డాలర్లను స్వచ్చంధంగా ఇచ్చారు. హూరున్ రీసెర్చ్ ప్రకారం ఇటీవల ముఖేష్ అంబానీ ప్రపంచ ఎనిమిదో కుబేరుడిగా నిలిచారు. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి 12.70 లక్షల కోట్ల రికార్డ్ స్థాయికి చేరుకుంది.