న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధం ప్రభావం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వస్తాయనే ప్రచారం దేశంలో కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోంది. ఈ యుధం వల్ల ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ రేటు వంద డాలర్లను దాటేసింది. ఇందులో హెచ్చుతగ్గులు నమోదవుతున్నప్పటికీ.. ఇదివరకట్లా స్థిరత్వం కనిపించట్లేదు. క్రూడాయిల్కు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుదల బాట పట్టొచ్చనే ప్రచారం సాగుతోంది.

వంటనూనె.. పాలు..
దీనికి ఆరంభ సూచకంగా ఇదివరకే వంటనూనెల రేట్లు కూడా భారీగా పెరిగాయి. సలసలమంటూ కాగుతున్నాయి. వంటనూనెల రేట్లల్లో లీటర్ ఒక్కింటికి 20 నుంచి 40 రూపాయల వరకు పెరుగుదల కనిపించింది. ఇప్పుడు తాజాగా పాల వంతు వచ్చింది. పాల రేట్లు పెరగనున్నాయి. ఇప్పటికే అమూల్ తన పాల ధరలను పెంచింది. ఆ తరువాత పరాగ్ మిల్క్ ఫుడ్స్ కంపెనీ కూడా అదే బాట పట్టింది. ఈ రెండు కంపెనీలు కూడా పాల ధరలను లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల వరకు పెంచాయి. ఈ నెల 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి.

జులై తరువాత ఇదే తొలిసారి..
పాల సేకరణ రేట్లను పెంచాల్సి రావడం వల్ల అదనంగా పడిన భారాన్ని వినియోగదారులపై నామమాత్రంగా మోపినట్లు వివరించింది. గోల్డ్, తాజా, శక్తి, టీ-స్పెషల్ వంటి వేరియంట్లు ప్రస్తుతం అమూల్లో అందుబాటులో ఉన్నాయి. అమూల్ గోల్డ్ అర లీటర్ పాల ధర 30, తాజా బ్రాండ్ అర లీటర్ 24, శక్తి అర లీటర్ 27 రూపాయలకు లభిస్తాయని తెలిపింది. అమూల్ పాల ధరలు పెరగడం ఏడు నెలల తరువాత ఇదే తొలిసారి. గత సంవత్సరం జులైలో చివరిసారిగా అమూల్ సమాఖ్య తన పాల రేట్లను పెంచింది.

మదర్ డెయిరీ వంతు..
ఇప్పడు తాజాగా మదర్ డెయిరీ కూడా పాల రేట్లను పెంచింది. లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల మేర పెంచుతున్నట్లు తెలిపింది. ఆదివారం నుంచి పెరిగిన ధరలు అందుబాటులోకి వస్తాయి. పాల సేకరణ, ప్యాకేజింగ్ మెటీరియల్, ఇంధన ధరలు పెరగడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని మదర్ డెయిరీ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ప్రస్తుతం 57 రూపాయలు పలుకుతోన్న మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్డ్ లీటర్ పాలు ఆదివారం నుంచి 59 రూపాయలకు చేరుతుంది.

కొత్త రేట్లివీ..
టోన్డ్ మిల్క్-49 రూపాయలు, డబుల్ టోన్డ్ మిల్క్-43 రూపాయలు, ఆవు పాలు 51 రూపాయలు, బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్) 46 రూపాయలు పలుకుతుంది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోనే మదర్ డెయిరీ 30 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తోంది ప్రతి రోజూ. అమూల్, పరాగ్ మిల్క్ ఫుడ్స్ తరువాత మదర్ డెయిరీ వాటా అధికం. అమూల్ కోటిన్నర, పరాగ్ మిల్క్ 37 లక్షల లీటర్ల మేర పాలను విక్రయిస్తోన్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications