కరోనా సంక్షోభం నుండి మైక్రోసాఫ్ట్ బయటపడుతుంది: సత్య నాదెళ్ల
కరోనా వైరస్ సంక్షోభాన్ని మైక్రోసాఫ్ట్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఆ సంస్థ సీఈవో సైత్య నాదెళ్ల అన్నారు. మైక్రోసాఫ్ట్ మూలాలు పటిష్టమని, ఈ పరిస్థితుల నుండి బయటపడతామనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. అమెరికా, ఐరోపా, ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్లలో డిమాండ్పై ఏ మేరకు ప్రభావం పడిందనే విషయం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పారు. ముందు ముందు తెలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇంటి నుండి క్లయింట్స్కు అవసరాలను తీరుస్తున్న విధానంపై సత్య నాదెళ్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అితే సరఫరా విషయంలో అవరోధం ఎదురవుతోందని చెప్పారు.అమెరికా, యూరప్ సహా ఇతర దేశాల మార్కెట్లు భారీగా దెబ్బ తిన్నాయని చెప్పారు.
ఈ ఏడాది చివరలో ఎక్స్ బాక్స్ గేమింగ్ కన్సోల్ సహా పలు సర్ఫేస్ డివైజెస్ను విడుదల చేస్తామని కరోనా వైరస్ పరిణామాలకు ముందు మైక్రోసాఫ్ట్ తెలిపింది. దీనిపై సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. వీటిని అందుబాటులోకి తెస్తామనే అంశాన్ని పక్కన పెడితే నాణ్యత, డిమాండ్ పరిస్థితులు, అన్నింటి కంటే ముఖ్యంగా ప్రజల భద్రతపై దృష్టి సారిస్తున్నామన్నారు.
COVID 19: ఇండియా షట్డౌన్ విలువ రూ.9 లక్షల కోట్లు, ప్రస్తుతానికి ప్రభుత్వం మౌనం!