ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలంగాణ రాజధాని హైదరాబాద్లో అతిపెద్ద డేటా సెంటర్ను నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రూ.15,000 కోట్లతో ఈ డేటా సెంటర్ను ఏర్పాటుచేసే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ ఉందని తెలుస్తోంది. ప్రభుత్వంతో చర్చలు తుది దశకు చేరుకున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి.
త్వరలో దీనిపై మైక్రోసాఫ్ట్ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఈ డేటా సెంటర్ కోసం ఇప్పటికే హైదరాబాద్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ కలిసి ఓ స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మైక్రోసాఫ్ట్ స్పందించాల్సి ఉంది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతోన్న విషయం తెలిసిందే. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ కూడా భారత్లో డేటా సెంటర్ ఏర్పాటు దిశగా కనిపిస్తున్నాయి. 2024 నాటికి భారత్లో డేటా సెంటర్స్ ఆదాయం నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

ఇదిలా ఉండగా భారత్లో డేటా సెంటర్స్ నిర్మాణం కోసం కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ ఇన్ఫ్రాతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకునే దిశగా వెళ్తోంది. బీఏఎం డిజిటల్ రియాల్టీ పేరిట డేటా సెంటర్స్ను నిర్మించాలని యోచిస్తున్నారు. అలాగే భారత్లో క్లౌడ్ డేటా సెంటర్స్ ఏర్పాటు విషయమై 2019లో రిలయన్స్ జియోృ-మైక్రోసాఫ్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా జియో నెట్వర్క్ ద్వారా మైక్రోసాఫ్ట్ తమ క్లౌడ్ టెక్నాలజీ అజూర్ క్లౌడ్ను అందుబాటులోకి తీసుకురానుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications