కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. అత్యవసర వస్తువుల దుకాణాలు మినహా అన్ని మూతబడ్డాయి. కరోనా కారణంగా ఇటీవల చికెన్, గుడ్లపై కూడా ప్రభావం పడింది. చికెన్ వ్యాపారులు, చేపల వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఆన్ లైన్ మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో ఆన్లైన్ ఆర్డర్లు భారీగా పెరిగాయట.

మాంసం విక్రయాలు
అత్యల్ప మాంసం తలసరి వినియోగ దేశాల్లో భారత్ ఉంది. 2013లో ప్రపంచ సగటు 33.2 కిలోలు ఉండగా మన దేశంలో మాత్రం 5.6 కిలోలుగా ఉంది. ఈ పరిశ్రమ అంచనా ప్రకారం ప్రతి ఏడాది 40 బిలియన్ డాలర్ల వ్యాల్యూతో 20 శాతం వృద్ధి సాధిస్తోంది. బెంగళూరుకు చెందిన నందూస్ చికెన్ సొంత హ్యాచరీస్, ఫీడ్ మిల్స్, బ్రీడర్ ఫామ్స్, ప్రాసెసింగ్ సెంటర్లు,, కోల్డ్ చైన్లు ఉన్నాయి. కరోనా కారణంగా ఇది తన 49 స్టోర్లలో 26 స్టోర్స్ను మూసివేసింది.

ఐనా డబుల్ ఆర్డర్స్
నందుస్ చికెన్ సగానికి పైగా స్టోర్స్ను క్లోజ్ చేసినప్పటికీ ఆర్డర్లు మాత్రం పెరిగాయట. తమ స్టోర్స్ కొన్నింటిని మూసివేసినప్పటికీ తమ ఆర్డర్ల వృద్ధి దాదాపు రెట్టింపు అయిందని నందూస్ ఫౌండర్, చీఫ్ ఎఘ్జిక్యూటివ్ ఆపీసర్ నరేంద్ర పశుపతి చెప్పారు.

వర్చువల్ కమాండ్ సెంటర్
నందూస్ చికెన్ కిలో రూ.250 వరకు విక్రయిస్తుంది. దీనిని బిర్యానీ, చికెన్ కర్రీ వంటి వాటికి ఉపయోగిస్తారు. అలాగే, చికెన్ పాప్కార్న్, చికెన్ బర్గర్, చికెన్ నగ్గెట్స్ వంటి వాటికి కూడా ఉపయోగిస్తారు. నందు చికెన్లో 110 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. తాజా పరిస్థితుల్లో ఇది 17 మంది టీమ్తో వర్చువల్ కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేసింది.

15వేల డెలివరీలు
తమ వద్ద పని చేసే ఉద్యోగుల్లో చాలామందికి తామే వసతి కల్పిస్తున్నామని, దీంతో తమ వద్ద పని చేసే ఉద్యోగులను ప్రత్యేకంగా రమ్మని చెప్పవలసిన అవసరం లేదని, ఆర్డర్ వచ్చినప్పుడు డెలివరీ సులభమైందని పశుపతి చెప్పారు. ఈ సంస్థ వారానికి 15,000 డెలివరీలు చేస్తోంది. సొంత డెలివరీలతో పాటు జొమాటో, స్విగ్గీ, డుంజో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా కూడా బిజినెస్ ఉంటోంది. లాక్డౌన్కు ముందు సరాసరిన నెలకు 40,000 ఆర్డర్లు వచ్చేవని, ఇప్పుడు నెలకు 65,000 వరకు ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు.

భారీగా పెరిగిన డిమాండ్
ఏడు మెట్రో నగరాల్లో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న మీట్ ప్రొడ్యూసర్ లిసియస్ కోఫౌండర్ వివేక్ గుప్తా మాట్లాడుతూ.. గత ఏడాది డిసెంబర్ నెలలో ఈ-ఫండింగ్ సిరీస్ ద్వారా 30 మిలియన్ డాలర్లు సమీకరించామని, తమ సంస్థ 700 మంది ఉద్యోగులతో సేవలు అందిస్తోందని చెప్పారు. లాక్ డౌన్కు ముందు తమ వ్యాపారం వారానికి 40 శాతం పెరుగుదల నమోదు చేసిందని, ప్రస్తుతం 200 శాతం వృద్ధిని చూస్తున్నామని చెప్పారు.

రోజు 18వేల ఆర్డర్లు
ఎక్కువగా సేల్ అవుతున్న వాటిలో చికెన్, చేపలు ఉన్నాయని వివేక్ చెప్పారు. ఇటీవలి కాలంలో కొత్త కస్టమర్లు భారీగా పెరిగారని తెలిపారు. ప్రతిరోజు 18,000 ఆర్డర్లు ప్రాసెస్ చేస్తోందన్నారు.

రోజుకు 1500 కాల్స్
ముంబై కేంద్రంగా పని చేసే పెస్కా ఫ్రెష్ ఫౌండర్ సంగ్రమ్ సావంత్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ తర్వాత ఆన్ లైన్ అమ్మకాలు భారీగా పెరిగాయని చెప్పారు. గత కొద్ది రోజులుగా ఆన్ లైన్ సేల్స్ రెట్టింపు అయ్యాయని చెప్పారు. ప్రతి రోజు 1500 కాల్స్ వస్తున్నాయని చెప్పారు. అయితే జాలర్లు తమ తమ ఇళ్లకు వెళ్లిపోవడంతో చేపల రావడం తగ్గిందన్నారు.

పరిస్థితులు పరిశీలిస్తున్నాం
కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికి అప్పుడు పరిశీలిస్తున్నామని వివేక్ గుప్త అన్నారు. అవసరమైన మార్గదర్శకాలు పాటిస్తున్నామన్నారు. భద్రతా నిబంధనలు పాటించేందుకు ప్రభుత్వం, స్థానిక అధికారులతో కలిసి పని చేస్తున్నామన్నారు. కానీ బ్యాకెండ్ సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. మ్యాన్ పవర్, లాజిస్టిక్స్ పరంగా ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాలన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications