చెన్నై: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న మహీంద్రా ఎక్స్యూవీ 700 (Mahindra XUV 700) మార్కెట్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందే.. అంటే ఈ సాయంత్రమే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ యాజమాన్యం.. ఈ వెహికల్ను లాంచ్ చేయనుంది. దేశీయ, విదేశీ మార్కెట్లో ఈ లగ్జరీ కారును లాంచ్ చేయడం ఇదే తొలిసారి. వరల్డ్ వైడ్గా ఈ కారుకు మంచి డిమాండ్ లభించిందని, ఆశించిన స్థాయిలో ఆర్డర్లు అందుతున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది.

ధర అన్ అఫిషియల్..
ఈ కారును ధర మాత్రం ఇప్పట్లో వెలువడకపోవచ్చు. దీని ధరను దేవీ శరన్నవ రాత్రుల సందర్భంగా అక్టోబర్లో ప్రకటించాలని కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. అన్ అఫిషియల్గా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ కారు ధర 14 లక్షల నుంచి 18 లక్షల రూపాయలకు వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మహీంద్రా కంపెనీకే చెందిన ఎక్స్యూవీ 500తో పోలిస్తే ఇది అప్డేట్ వెర్షన్గా చెప్పుకోవచ్చు. అత్యాధునిక ఫీచర్లతో 700 మార్కెట్లో గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వనుంది.

లోగో కూడా..
ఇక మహీంద్రా అండ్ మహీంద్రా లోగో కూడా మారబోతోంది. బ్రాండ్ న్యూ లోగోను రూపొందించింది కంపెనీ యాజమాన్యం. ఈ ఎక్స్యూవీ 700 కారుతోనే కొత్త లోగో కూడా సాక్షాత్కరిస్తుంది. కొత్త లోగోతో రాబోతోన్న తొలి కారు కూడా ఇదే. ఈ మధ్యకాలంలో కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఆటోమొబైల్ కంపెనీలు కార్లను తీర్చిదిద్దుతోన్న విషయం తెలిసిందే. కనీసం ఏడుమంది వరకు ప్రయాణించేలా కొత్త కార్లను డిజైన్ చేస్తోన్నాయి. వాటిని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి.

వాటికి పోటీ..
మహీంద్రా ఎక్స్యూవీ 700 కూడా ఈ కేటగిరీకి చెందినదే. సెవెన్ సీటర్ కావడం వల్ల కుటుంబ సభ్యులు మొత్తం ప్రయాణించడానికి వీలు ఉంటుంది. మోరిస్ గ్యారెజెస్ (ఎంజీ) హెక్టార్ ప్లస్, హ్యుందాయ్ అల్కాజర్, టాటా సఫారీ వంటి ఎస్యువిలతో మహీంద్రా అండ్ మహీంద్రా పోటీపడనుంది. ఈ కార్లన్నీ సెవెన్ సీటర్లే కావడం వల్ల.. అదే కేటగిరీలో గట్టిపోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎక్స్యూవీ 700ను డిజైన్ చేసిందనేది ఆటోమొబైల్ సెక్టార్ విశ్లేషకుల అభిప్రాయం.
అప్గ్రేడ్ వెర్షన్..
ఎక్స్యూవీ 500ను అప్డేట్ చేస్తూ.. దాన్ని సెవెన్ సీటర్గా మార్చింది కంపెనీ యాజమాన్యం. 500 తరహాలోనే ఎక్స్యూవీ 700లో కూడా యాంగ్యులర్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్ యూనిట్, వెర్టికల్ క్రోం హైలైట్స్తో స్క్వారిష్ గ్రిల్ వంటి ఫీచర్లతో రానుంది. ఈ ఎక్స్యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. 2.0-లీటర్ 200 బీహెచ్పీ ఎంస్టాలిన్ పెట్రోల్ ఇంజిన్ ఎక్స్యూవీ 700 ప్రత్యేకత. అలాగే- డీజిల్ వేరియంట్లో 2.0-లీటర్ 185 బీహెచ్పీ సామర్థ్యం కలిగిన ఎంహాక్ డీజిల్ ఇంజిన్లో లభిస్తుంది.
సాయంత్రమే గ్రాండ్ లాంచ్..
సన్రూఫ్ అండ్ విండోస్ కంట్రోలింగ్ ప్యానెల్స్, యూఎస్బీ, బ్లూటూత్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ సాయంత్రం 4 గంటలకు ఈ ఎక్స్యూవీ 700ను మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ యాజమాన్యం ఆవిష్కరించనుంది. చెన్నైలో ఈ కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించబోతోంది. ఆ వెంటనే ఆర్డర్లను అందుకుంటామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ధరను మాత్రం వచ్చే అక్టోబర్లో వెల్లడిస్తామని స్పష్టం చేస్తోన్నారు. మోరిస్ గ్యారెజెస్ (ఎంజీ) హెక్టార్ ప్లస్, హ్యుందాయ్ అల్కాజర్, టాటా సఫారీ వంటి ఎస్యూవీలకు అనుగుణంగా ధర ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications