Cylinders Subsidy: రూ.11,896 కోట్ల నుంచి రూ. 242 కోట్లకు తగ్గిన సిలిండర్ల సబ్సిడీ..
సిలిండర్ పై అందిస్తున్న సబ్సిడీని కేంద్రం క్రమంగా తగ్గిస్తోంది. ఇందుకు సంబంధంచి కేంద్ర పెట్రోలియం శాఖ లోక్ సభలో ప్రకటన చేసింది. 2021 ఆర్థిక సంవత్సరంలో 11,896 కోట్ల సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని 2022లో రూ. 242 కోట్లకు తగ్గించింది. ప్రస్తుతం ఉజ్వల కనెక్షన్లకు మినహా ఇతర ఏ కనెక్షన్లకు సబ్సిడీ ఇవ్వడం లేదు.
అంతర్జాతీయ ధరలు..
"దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లోని ఆయా ఉత్పత్తుల ధరలతో ముడిపడి ఉంటాయి. అయినప్పటికీ, దేశీయ ఎల్పిజి కోసం వినియోగదారులకు సమర్థవంతమైన ధరను ప్రభుత్వం మాడ్యులేట్ చేస్తూనే ఉంది, "అని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ రాతపూర్వక సమాధానంలో తెలిపారు.
2018లో రూ23,464 కోట్లు..
LPG సబ్సిడీ పరంగా కేంద్రం 2018 ఆర్థిక సంవత్సరంలో రూ23,464 కోట్లు, 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.37,209 కోట్లు, 2020 ఆర్థిక సంవత్సరంలో రు.24,172 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. జూన్ 2020 నుంచి సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వడంతోలబ్ధిదారుల సంఖ్య 93 మిలియన్లకు తగ్గింది.
పెరిగిన సిలిండర్ల ధర..
దేశీయ వంట సిలిండర్ల ధర కూడా క్రమంగా పెరిగింది. ఈ నెల ప్రారంభంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు డొమెస్టిక్ సిలిండర్ల ధరను రూ.50 పెంచాయి. ఢిల్లీలో ఇప్పుడు ఒక్కో సిలిండర్ ధర రూ.1,053గా ఉంది.