కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మొబైల్ ప్రీపెయిడ్ యూజర్లు ఇబ్బందిపడకుండా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని TRAI టెల్కోలను ఆదేశించింది. సర్వీసులకు అంతరాయం కలగకుండా వ్యాలిడిటీని పొడిగించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. లాక్డౌన్ సమయంలో ప్రీపెయిడ్ యూజర్లంతా నిరంతరాయంగా సర్వీసులు పొందేందుకు వ్యాలిడిటీని పొడిగించడం సహా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది.

రీఛార్జ్ గడువు పొడిగించండి
టెలికం సేవలను నిత్యావసర సర్వీసుల కింద పరిగణించి, మినహాయింపు ఇచ్చినప్పటికీ లాక్ డౌన్ కారణంగా కస్టమర్ సర్వీస్ సెంటర్స్, పాయింట్ ఆఫ్ సేల్స్ స్టోర్స్ పని చేయకపోవడం వల్ల సర్వీసులకు విఘాతం కలగవచ్చు. రీఛార్జ్ గడువు ముగిసిపోతే ప్రస్తుతం మిగిలి ఉన్న ఆప్షన్ ఆన్లైన్ మాత్రమే. అందరికీ ఇది అందుబాటులో ఉండదు లేదా తెలియదు. అలాగే సర్వీస్ సెంటర్స్ లేవు. ఈ నేపథ్యంలో సేవలు నిలిచిపోకుండా ప్రీపెయిడ్ కనెక్షన్ రీఛార్జ్ గడువు పొడిగించాలని ట్రాయ్ సూచించింది. ఆఫ్ లైన్ విధానాల్లో ప్రీపెయిడ్ బ్యాలెన్స్ టాప్ అప్ చేయించుకునేవారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ట్రాయ్ సూచించింది.

BSNL రూ.10 అదనపు టాక్ టైమ్
ట్రాయ్ సూచన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్టెల్ తమ కస్టమర్లకు భారీ ఊరటను కల్పించాయి. ప్రీపెయిడ్ వినియోగదారులకు వ్యాలిడిటీ గడువును ఏప్రిల్ 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ప్రకటించాయి. అలాగే అదనంగా రూ.10 టాక్ టైమ్ అందిస్తున్నట్లు తెలిపాయి. దీంతో వినియోగదారులు, ముఖ్యంగా పేదలు లాక్ డౌన్ సమయంలో బ్యాలెన్స్ లేకున్నా నిరంతరాయంగా సేవలు పొందే వీలు ఉంటుందని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ ట్వీట్ చేశారు.

ఏప్రిల్ 20 వరకు BSNL పొడిగింపు
లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో మార్చి 22వ తేదీ తర్వాత వ్యాలిడిటీ అయిపోయిన వాళ్లు రీఛార్జ్ చేసుకోలేకపోయారని, కస్టమర్ల కోసం ఏప్రిల్ 20 వరకు గడువును పెంచామని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

అదే దారిలో Airtel
లాక్ డౌన్ను దృష్టిలో ఉంచుకొని అల్పాదాయ వర్గాలకు చెందిన సుమారు 8 కోట్ల పైగా ప్రీపెయిడ్ కస్టమర్ల ప్యాకేజీ కాలపరిమితిని ఏప్రిల్ 17వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. ప్లాన్ గడువు తీరిపోయినా 17వ తేదీ వరకు కస్టమర్లు ఇన్కమింగ్ కాల్స్ను పొందవచ్చని తెలిపింది. దీంతో పాటు 8 కోట్ల మంది ప్రీపెయిడ్ అకౌంట్లలో ఉచితంగా రూ.10 టాక్టైమ్ క్రెడిట్ చేస్తున్నట్లు తెలిపింది. టాక్ టైమ్, ఎస్సెమ్మెస్ కోసం ఉపయోగించవచ్చునని, ఈ మొత్తాన్ని రికవరీ చేయబోమని తెలిపింది. 48 గంటల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని నిన్న తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications