కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆగస్ట్ వరకు లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. దీనిని డిసెంబర్ వరకు పొడిగించాలని వివిధ వర్గాల నుండి డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఆర్థిక కార్యకలాపాలు తెరుచుకున్నందున మారటోరియం పొడిగింపు అవసరం లేదని HDFC బ్యాంకు చైర్మన్ దీపక్ పరేఖ్ ఇటీవల వ్యాఖ్యానించారు. తాజాగా ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ఆగస్ట్ తర్వాత లోన్ మారటోరియం పొడిగింపు అవసరం లేదని చెప్పారు.

పొడిగింపు అవసరం లేదు
కరోనా కారణంగా మార్చి నుండి ఆగస్ట్ 31వ తేదీ వరకు మారటోరియం ఉందని, దీనిని ఇంతకుమించి పొడిగించాల్సిన అవసరం లేదని రజనీష్ కుమార్ అన్నారు. రుణ మారటోరియం పొడిగింపు ఆగస్ట్ తర్వాత అవసరం లేదని, తనతో సహా ఏ బ్యాంకర్ ఈ పొడిగింపు కోరుకోరని అభిప్రాయపడ్డారు. కరోనా వల్ల జరిగిన నష్టానికి ఆరు నెలల కాలం మారటోరియానికి సరిపోతుందన్నారు. ఈఎంఐ వాయిదాలకు ఆరు నెలల కాలమే చాలా ఎక్కువ సమయం అన్నారు. మారటోరియాన్ని పొడిగించవద్దన్న దీపక్ పరేఖ్తో ఆయన ఏకీభవించారు.

చెల్లించగలిగే సామర్థ్యం ఉన్నవారు తప్పించుకుంటారు
దయచేసి మారటోరియాన్ని పొడిగించవద్దని, చెల్లించగలిగే సమర్థత ఉన్న కార్పోరేట్లు, వ్యక్తులు ఈఎంఐలను వాయిదా వేసేందుకు దీనిని అనుకూలంగా మార్చుకుంటారని రజనీష్ కుమార్ అన్నారు. మారటోరియం పొడిగింపు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని, అదే జరిగితే చిన్న తరహా ఎన్బీఎఫ్సీలు దారుణంగా నష్టపోతాయన్నారు.

రూ.40 లక్షల కోట్ల రుణాలు.. పెండింగ్
రుణమారటోరియం కారణంగా ప్రస్తుతం బ్యాంకింగ్ ఇండస్ట్రీకి రూ.40 లక్షల కోట్ల ద్రవ్యత నిలిచిపోయినట్లుగా భావిస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలో ఈ మొత్తం తాత్కాలిక నిషేధంలో ఉందన్నారు. కార్పోరేట్ రంగానికి రిటైల్, టర్మ్ లోన్లు రెండూ ఉన్నాయి. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఎన్పీఏలు పెరిగే అవకాశముందని అంటున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications