2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండో అర్ధభాగంలో తర్వాతే లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC)ని స్టాక్ మార్కెట్లో నమోదు చేస్తామని కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ అన్నారు. స్టాక్ మార్కెట్లో నమోదుకు ముందు పాటించాల్సిన అనేక ప్రక్రియలు ఉన్నాయని ఆదివారం తెలిపారు. శాసన మార్పులు చేయాల్సిఉందని, ఇందుకు న్యాయశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అన్నీ పూర్తయి లిస్టింగ్ చేసేందుకు సమయం పడుతుందన్నారు.

సెప్టెంబర్ తర్వాత లిస్టింగ్
ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత ఎల్ఐసీ లిస్టింగ్ ప్రక్రియ ఉండవచ్చునని రాజీవ్ కుమార్ చెప్పారు. ఎల్ఐసీ, ఐడీబీఐ బ్యాంకుల్లో వాటా విక్రయించి 2020-21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.90,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని కూడా ఇందుకు అనుగుణంగానే రూ.2.10 లక్షల కోట్లుగా నిర్దేశించుకుంది.

ఆరామ్కోతో పాటు..
ప్రస్తుతం ఎల్ఐసీలో ప్రభుత్వం వాటా 100 శాతం. ఐడీబీఐ బ్యాంకులో 46.5 శాతం వాటా ఉంది. అరవై ఏళ్ల చరిత్ర కలిగిన ఎల్ఐసీకి బీమా రంగంలో 70 శాతానికి పైగా మార్కెట్ ఉంది. పాలసీల విక్రయాల్లో 76.28 శాతం, తొలి ఏడాది ప్రీమియం వసూళ్లలో 71 శాతం వాటా ఉంది. ఎల్ఐసీపై మార్కెట్లు బుల్లిష్గా ఉన్నాయి. ఈ శతాబ్దపు అత్యంత ఖరీదైన ఐపీవోల్లో సౌదీ ఆరామ్కోతో పాటు ఎల్ఐసీ కూడా జాబితాలో ఉండవచ్చునని భావిస్తున్నారు.

ఉద్యోగుల యూనియన్ వ్యతిరేకత
మరోవైపు, ఎల్ఐసీలో వాటా విక్రయ ప్రక్రియను ఆల్ ఇండియా ఎల్ఐసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తోంది. ఎల్ఐసీలో వాటా విక్రయ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ నెల 4న ఒక గంట పాటు విధులు బహిష్కరిస్తున్నట్లు ఆలిండియా ఎల్ఐసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ రాజేష్ నింబాల్కర్ చెప్పారు. ఆ తర్వాత వరుసగా ఆందోళనలు చేపడతామన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications