ముంబై: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రైవేటీకరణలో భాగంగా జారీ చేసిన ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్కు మంచి ఆదరణే లభించింది. ఈ ఐపీఓ- గుడ్ రిటర్న్స్ను అందిస్తుందనే అభిప్రాయం మెజారిటీ ఇన్వెన్టర్లలో ఉండటమే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. ఎల్ఐసీ మొత్తంగా 16,20,78,067 షేర్లను జారీ చేయగా.. దీనికి దాదాపు మూడురెట్లు అధికంగా సబ్స్క్రైబ్ అయ్యాయి. 47,83,67,010 షేర్లను కొనుగోలు చేశారు ఇన్వెస్టర్లు.

పాలసీ హోల్డర్ల పోర్షన్ నుంచి..
రూ.21,000 కోట్లను సమీకించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ ఐపీఓను జారీ చేసిన విషయం తెలిసిందే. పబ్లిక్ ఇష్యూ ద్వారా ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడి విలువ 20,557 కోట్ల రూపాయలు. 20,557 కోట్ల రూపాయలను ప్రభుత్వం సమీకరించుకోగలిగింది. పాలసీ హోల్డర్ల పోర్షన్ నుంచి మాత్రం తిరుగులేని రెస్పాన్స్ లభించింది. 15,391 కోట్ల రూపాయల విలువ చేసే షేర్లను పాలసీ హోలర్డ్ కోసం రిజర్వ్ చేయగా.. రూ.45,379 కోట్ల అప్లికేషన్స్ దాఖలయ్యాయి.

సెలవురోజునా..
ఈ నెల 4వ తేదీన ఇది ప్రారంభమైన ఎల్ఐసీ ఐపీఓ.. 9వ తేదీన ముగిసింది. శనివారం, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్కు సెలవు ఉన్నప్పటికీ.. అప్లికేషన్లను దాఖలు చేసుకునే వీలు కల్పించింది సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్. ఎల్ఐసీ ఐపీఓ విషయంలో ఆ వెసలుబాటును కల్పించింది. ప్రైస్ బ్యాండ్ 902 నుంచి 949 రూపాయలతో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. అలాట్మెంట్ రూపంలో ఎల్ఐసీ షేర్లను కొనుగోలు చేయదలిచిన ఇన్వెస్టర్లు ఒక్కో షేర్కు గరిష్ఠంగా 949 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. లాట్ సైజ్ 15.

అలాట్మెంట్ బిగిన్స్..
అంటే.. ఇన్వెస్టర్లు కనీసం 15 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం 14,235 రూపాయలను పెట్టుబడి రూపంలో పెట్టాల్సి ఉంటుంది. ఇలా 13 లాట్ల వరకు తీసుకోవచ్చు. షేర్ల అలాట్మెంట్ ప్రక్రియను ఎల్ఐసీ చేపట్టింది. షేర్ల కోసం దాఖలు చేసుకున్న రిటైల్ ఇన్వెస్టర్లు, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు ప్రక్రియను మొదలు పెట్టింది. వారి డీమ్యాట్ అకౌంట్లల్లో షేర్లను డిపాజిట్ చేస్తుంది. ఇది ముగిసిన తరువాత- షేర్లు అలాట్మెంట్ దక్కని వారికి రీఫండ్ చేస్తుంది ఎల్ఐసీ.

స్టేటస్ గురించి తెలుసుకోండిలా..
ఎల్ఐసీ షేర్లు తమకు అలాట్ అయ్యాయా? లేదా అని తెలుసుకోవడానికి ఇన్వెస్టర్లకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి- బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అధికారిక వెబ్సైట్, రెండు- ప్రైవేట్ స్టాక్ సర్వీసులను అందించే ఒకట్రెండ్ వెబ్సైట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. బీఎస్ఈ అధికారిక వెబ్సైట్ లింక్ bseindia.com/investors/appli_check.aspx లేదా ris.kfintech.com/ipostatus/ipos.aspx ను తొలుత క్లిక్ చేయాలి. ఈక్విటీని ఎంచుకోవాలి.
అక్కడ సెలెక్ట్ ఐపీఓ అనే చోట ఎల్ఐసీ ఐపీఓను ఎంపిక చేసుకోవాలి. అప్లికేషన్, పాన్ నంబర్లను అందులో పొందుపర్చాలి. సబ్మిట్ బటన్ను క్లిక్ చేసిన వెంటనే షేర్లు అలాట్ అయ్యాయా? లేదా అనేది తెలిసిపోతుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications