August 1st: జూలై నెల దాదాపు ముగియనుంది. ఆగస్టు నెల ప్రారంభమౌతోంది. ప్రతి నెలలాగే ఈసారి కూడా వచ్చే మెుదటి తారీఖు నుంచి చాలా ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి. ఇవి నేరుగా మీ జేబుపై ప్రభావం చూపే మార్పులు. ఈ మార్పుల్లో గ్యాస్ ధర (LPG), బ్యాంకింగ్ సిస్టమ్, ITR, PM కిసాన్ సమ్మాన్ నిధి, PM ఫసల్ బీమా యోజనకు సంబంధించిన కీలక అప్డేట్లు ఉన్నాయి. మరి ఆగస్ట్ 1 నుంచి ఎలాంటి రూల్స్ మారుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్ రూల్స్..
మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB)లో ఖాతా ఉన్నట్లయితే ఈ వార్త మీకోసమే. ఆగస్ట్ 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాలో చెక్ ద్వారా చెల్లింపు నియమాలు మారుతాయని గమనించండి. దీనికి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో ఉన్న చెక్కులకు సానుకూల చెల్లింపు విధానం అమలు చేయబడుతోంది. దీని కింద బ్యాంకు ఎస్ఎంఎస్, నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్ ద్వారా చెక్కు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులు ఇవ్వాల్సి ఉంటుంది.

PM కిసాన్ కోసం KYC నిబంధనలు..
PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన KYC కోసం మీకు జూలై 31 వరకు మాత్రమే సమయం ఇవ్వబడింది. ఆగస్టు 1 నుంచి రైతులు కేవైసీ ప్రక్రియను పూర్తిచేయలేరు. రైతులు తమ సమీప కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించడం ద్వారా కూడా వారి e-KYCని పొందవచ్చు. ఇది కాకుండా.. ఇంట్లో కూర్చొని PM కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా e-KYC ఆన్లైన్లో చేయవచ్చు. రైతుల సౌలభ్యం కోసం e-KYC చివరి తేదీని పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల e-KYC కోసం చివరి తేదీ జూలై 31 వరకు పొడిగించబడింది. ఇంతకుముందు e-KYC నిర్వహించడానికి చివరి తేదీ మే 31గా ఉండేది.

3PM ఫసల్ బీమా యోజన..
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది . రిజిస్ట్రేషన్కు చివరి తేదీ జూలై 31గా ఉంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఉండదు. సకాలంలో పూర్తి చేయకపోతే మీరు ఈ పథకం ప్రయోజనాలను కోల్పోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో చేయవచ్చు.

LPG ధరలు..
LPG ధరలు ప్రతి నెల 1వ తేదీన మారుతాయని మనందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈసారి కంపెనీలు గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను మార్చవచ్చు. గతసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ చౌకగా మారగా, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెరిగింది.

ITR ఫైలింగ్..
ఆదాయపన్ను లేటుగా చెల్లించే ఆగస్ట్ 1 నుంచిపెనాల్టీ పడుతుంది. జూలై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చెల్లింపుదారు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షల వరకు లేదా అంతకంటే తక్కువ ఉంటే, అతను ఆలస్య రుసుముగా రూ.1,000 చెల్లించవలసి ఉంటుంది. పన్ను చెల్లింపుదారు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే.. అప్పుడు వారు రూ.5,000 ఆలస్య రుసుము చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలను గమనించి సకాలంలో పనులు పూర్తయ్యేలా ప్లాన్ చేసుకోవటం ఉత్తమం.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications