August 1st: జూలై నెల దాదాపు ముగియనుంది. ఆగస్టు నెల ప్రారంభమౌతోంది. ప్రతి నెలలాగే ఈసారి కూడా వచ్చే మెుదటి తారీఖు నుంచి చాలా ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి. ఇవి నేరుగా మీ జేబుపై ప్రభావం చూపే మార్పులు. ఈ మార్పుల్లో గ్యాస్ ధర (LPG), బ్యాంకింగ్ సిస్టమ్, ITR, PM కిసాన్ సమ్మాన్ నిధి, PM ఫసల్ బీమా యోజనకు సంబంధించిన కీలక అప్డేట్లు ఉన్నాయి. మరి ఆగస్ట్ 1 నుంచి ఎలాంటి రూల్స్ మారుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్ రూల్స్..
మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB)లో ఖాతా ఉన్నట్లయితే ఈ వార్త మీకోసమే. ఆగస్ట్ 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాలో చెక్ ద్వారా చెల్లింపు నియమాలు మారుతాయని గమనించండి. దీనికి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో ఉన్న చెక్కులకు సానుకూల చెల్లింపు విధానం అమలు చేయబడుతోంది. దీని కింద బ్యాంకు ఎస్ఎంఎస్, నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్ ద్వారా చెక్కు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులు ఇవ్వాల్సి ఉంటుంది.

PM కిసాన్ కోసం KYC నిబంధనలు..
PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన KYC కోసం మీకు జూలై 31 వరకు మాత్రమే సమయం ఇవ్వబడింది. ఆగస్టు 1 నుంచి రైతులు కేవైసీ ప్రక్రియను పూర్తిచేయలేరు. రైతులు తమ సమీప కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించడం ద్వారా కూడా వారి e-KYCని పొందవచ్చు. ఇది కాకుండా.. ఇంట్లో కూర్చొని PM కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా e-KYC ఆన్లైన్లో చేయవచ్చు. రైతుల సౌలభ్యం కోసం e-KYC చివరి తేదీని పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల e-KYC కోసం చివరి తేదీ జూలై 31 వరకు పొడిగించబడింది. ఇంతకుముందు e-KYC నిర్వహించడానికి చివరి తేదీ మే 31గా ఉండేది.

3PM ఫసల్ బీమా యోజన..
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది . రిజిస్ట్రేషన్కు చివరి తేదీ జూలై 31గా ఉంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఉండదు. సకాలంలో పూర్తి చేయకపోతే మీరు ఈ పథకం ప్రయోజనాలను కోల్పోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో చేయవచ్చు.

LPG ధరలు..
LPG ధరలు ప్రతి నెల 1వ తేదీన మారుతాయని మనందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈసారి కంపెనీలు గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను మార్చవచ్చు. గతసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ చౌకగా మారగా, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెరిగింది.

ITR ఫైలింగ్..
ఆదాయపన్ను లేటుగా చెల్లించే ఆగస్ట్ 1 నుంచిపెనాల్టీ పడుతుంది. జూలై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చెల్లింపుదారు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షల వరకు లేదా అంతకంటే తక్కువ ఉంటే, అతను ఆలస్య రుసుముగా రూ.1,000 చెల్లించవలసి ఉంటుంది. పన్ను చెల్లింపుదారు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే.. అప్పుడు వారు రూ.5,000 ఆలస్య రుసుము చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలను గమనించి సకాలంలో పనులు పూర్తయ్యేలా ప్లాన్ చేసుకోవటం ఉత్తమం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications