రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్లో కేకేఆర్ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటి వరకు డిజిటల్ ప్లాట్ఫాం జియోలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు రిలయన్స్ రిటైల్లోకి వస్తున్నాయి. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో ఇప్పటికే అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ రూ.7500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా కేకేఆర్ కూడా 1 బిలియన్ డాలర్ల నుండి 1.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL)లో సిల్వర్ లేక్ రూ.7500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది. ప్రీ-మనీ ఈక్విటీ వ్యాల్యూ రూ.4.21 లక్షల కోట్ల వద్ద ఈ పెట్టుబడులు పెడుతోంది. రూ.7500 కోట్లతో రిలయన్స్ వెంచర్స్లో 1.75 శాతం వాటాను సొంతం చేసుకోనుంది సిల్వర్ లేక్. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు రిలయన్స్ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి రిలయన్స్ జియోలోకి 1.35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.

సిల్వర్ లేక్ ఇంతకుముందు జియోలో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు రిలయన్స్ వెంచర్పై దృష్టి సారించింది. జియోలో రూ.10,202.55 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తాజా పెట్టుబడితో రిలయన్స్లో రిలయన్స్ రిటైల్, జియో ప్లాట్ఫాం వ్యాల్యుయేషన్ రూ.9 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ లిమిటెడ్. డిజిటల్ అనుబంధ విభాగం జియో బాటలోనే రిలయన్స్ రిటైల్లోను మైనార్టీ వాటా విక్రయం ద్వారా మరిన్ని నిధులు సమకూర్చుకునే ప్లాన్లో ముఖేష్ అంబానీ ఉన్నట్లుగా భావిస్తున్నారు. కంపెనీ వృద్ధి కోసం రిలయన్స్ వివిధ అవకాశాల్ని పరిశీలిస్తోంది. రిలయన్స్ రిటైల్లో పది శాతం వరకు వాటాను విక్రయించే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications