దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో మొబైల్ ఫోన్ల రీఛార్జ్ ఆన్లైన్ ద్వారా మినహా కస్టమర్ సర్వీస్ సెంటర్స్, పాయింట్ ఆఫ్ సేల్స్ స్టోర్స్ అందుబాటులో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఎయిర్టెల్ గడువు పొడిగించడంతో పాటు రూ.10 అదనపు టాక్ టైమ్ ఇచ్చాయి. ఇప్పుడు రిలయన్స్ జియో కూడా తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది.

ఏప్రిల్ 17 వరకు జియో ఇవి ఉచితం
లాక్ డౌన్ కొనసాగుతోన్నందున టెల్కకోలు తమ కస్టమర్లకు వరుసగా ఊరటను ఇచ్చే చర్యలు చేపడుతున్నాయి. రిలయన్స్ జియో తమ యూజర్లకు ఏప్రిల్ 17వ తేదీ వరకు 100 నిమిషాల కాల్స్, 100 సందేశాలను ఉచితంగా అందివ్వనున్నట్లు తెలిపింది. ఈ 100 నిమిషాలను దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మాట్లాడుకునే వెసులుబాటు కల్పించింది.

ప్రీపెయిడ్ వ్యాలిడిటీ అయిపోయినా పొడిగింపు
అలాగే, ప్రీపేయిడ్ వ్యాలిడిటీ అయిపోయినప్పటికీ లాక్ డౌన్ నేపథ్యంలో ఇన్కమింగ్ కాల్స్ సదుపాయాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ అత్యవసర సమయంలో తమ బంధువులు, స్నేహితులతో మాట్లాడుకోవటానికి ఒకవేళ అవసరమైతే హెల్త్ కేర్ సర్వీసులు పొందడానికి ఇది ఉపకరిస్తుందని అభిప్రాయపడింది.

ఇలా ఈజీగా రీఛార్జ్ చేసుకోండి..
లాక్ డౌన్ కొనసాగుతున్నందున్న ఆఫ్లైన్ ద్వారా రీచార్జ్ చేసుకునే జియో కస్టమర్లు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిలయన్స్ జియో తన ప్రకటనలో తెలిపింది. అలాగే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాకింగ్ ద్వారా కూడా జియో కస్టమర్లు సులువుగా రీచార్జ్ చేసుకోవచ్చని సూచించింది.
యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు ఎస్సెమ్మెస్ బ్యాకింగ్ ద్వారా కూడా రీచార్జ్ చేసుకోవచ్చని పేర్కొంది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రీపెయిడ్ యూజర్లు ఇబ్బందిపడకుండా తగు చర్యలు తీసుకోవాలని టెల్కోలకు ట్రాయ్ ఇటీవల ఆదేశించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications