ఢిల్లీ: అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భారత్లో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడతానని ప్రకటించారు. మన కరెన్సీలో రూ.7,100 కోట్లు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన అమెజాన్ సంభవ్ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. 2025 నాటికి 10 బిలియన్ డాలర్ల విలువ కలిగిన మేకిన్ ఇండియా ఉత్పత్తులను అమెజాన్ ఎగుమతి చేసేలా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. భారత్-అమెరికా మధ్య మరింత సంఖ్యత ఉండాల్సిన అవసరముందన్నారు.

7వేల కోట్ల పెట్టుబడిపై వ్యాపారుల ఆగ్రహం
భారత్లో రూ.7వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామని జెఫ్ బెజోస్ చేసిన ప్రకటనపై అఖిల భారత వర్తక వ్యాపారుల సమాఖ్య(CAIT) మండిపడింది. భారత్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కొల్లగొట్టేందుకు అమెజాన్ ప్రయత్నాలు చేస్తోందని తీవ్రంగా ధ్వజమెత్తింది. కేవలం వారి ప్రమోషన్ కోసమే తాజా పెట్టుబడుల నిర్ణయాన్ని వెల్లడించారని విమర్శించారు.

జెఫ్ గో బ్యాక్ అంటూ నినాదాలు
ఇండియా నిబంధనలను అతిక్రమిస్తూ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ పోర్టల్స్ ఇచ్చే భారీ డిస్కౌంట్ల కారణంగా చిరు వ్యాపారులు ఉపాధిని కోల్పోతున్నారని CAIT ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా జెఫ్ బెజోస్ రాకను నిరసిస్తూ బుధవారం నుంచి నిరసనలు చేపడుతోంది. జెఫ్ బెజోస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

మేం వారితో పోటీ పడలేం..
మేం వారితో పోటీ పడలేమని, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటి ద్వారా అనారోగ్యకరమైన పోటీ నెలకొందని ఓ వ్యాపారి అన్నారు. గత రెండేళ్లలో తమ అమ్మకాలు 15 శాతం కంటే ఎక్కువగా తగ్గాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ డిస్కౌంట్ల కారణంగా వినియోగదారులు ఆన్ లైన్ వైపు మొగ్గు చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

120 బిలియన్ డాలర్ల మార్కెట్
మరోవైపు, తమ వ్యాపారాన్ని పెంచుకోవడంతో పాటు 5,50,000 మంది సెల్లర్స్కు తమ ప్లాట్ ఫాం ద్వారా అవకాశం కల్పిస్తున్నామని అమెజాన్ చెబుతోంది. భారత ఈ-కామర్స్ మార్కెట్ ఈ ఏడాదికి 120 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని అంచనా. 2017-2020 మధ్య ఈ వృద్ధి 51 శాతంగా ఉండటం ఉంటుందని ఓ సర్వే అంచనా.
More From GoodReturns

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై తొలిసారిగా స్పందించిన ప్రధాని మోదీ.. భారత్కు తీవ్ర ఆందోళన కలిగించే అంశమంటూ..

ఉద్యోగులకు మళ్లీ అమెజాన్ షాక్.. ఆ 100 మంది కంపెనీకి రానవసరం లేదని కీలక ప్రకటన..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

UAE లోని అమెజాన్ డేటా సెంటర్పై దాడి.. ఇరాన్కు వార్నింగ్ ఇచ్చిన గల్ఫ్ దేశాలు..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?



Click it and Unblock the Notifications