కరోనా మహమ్మారి నేపథ్యంలో ట్యాక్స్ పేయర్లకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రప్రభుత్వం పన్ను సంబంధిత సేవల్ని ఇబ్బందుల్లేకుండా అందిస్తోంది. ఇందులో భాగంగా ట్యాక్స్ పేయర్స్ రీఫండ్ చేయాల్సిన మొత్తాలను వేగవంతంగా చెల్లిస్తోంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) పన్ను చెల్లింపుదారులకు ఇప్పటి వరకు రూ.1,18,324 కోట్ల మొత్తాన్ని రీఫండ్ చేసింది. ఈ మేరకు ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 29వ తేదీ మధ్య ఈ చెల్లింపులు జరిగాయి.

33 లక్షల ట్యాక్స్ పేయర్స్...
33 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్కు ఆరు నెలల్లో రూ.1.18 లక్షల కోట్ల మేర చెల్లించినట్లు ఆదాయపు పన్ను శాఖ బుధవారం తెలిపింది. ఇందులో పర్సనల్ ఇన్కం ట్యాక్స్(PIT) రీఫండ్ అమౌంట్ రూ.32,230 కోట్ల రీఫండ్స్ 31.75 లక్షల ట్యాక్స్ పేయర్స్కు చెల్లించినట్లు తెలిపింది. కార్పోరేట్ రీఫండ్స్ విషయానికి వస్తే 1.78 లక్షల కేసుల్లో రూ.86,094 కోట్లు అందించినట్లు తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పన్ను సంబంధిత సేవల్ని అందించడంపై దృష్టి సారించింది. పెండింగ్లో ఉన్న పన్ను రీఫండ్స్ను క్లియర్ చేస్తోంది.

20 రోజుల క్రితమే రూ.1 లక్ష కోట్లు క్రాస్
గత నెల వరకే లక్ష కోట్లు దాటాయి. ఏప్రిల్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీ మధ్య 27.55 లక్షల మంది ట్యాక్స్పేయర్స్కు రూ.1.01 లక్షల కోట్లకు పైగా రీఫండ్స్ జారీ చేసింది. ఇందులో 25,83,507 పన్ను చెల్లింపుదారులకు రూ.30,768 కట్ల వ్యక్తిగత ఆదాయపు పన్ను రీఫండ్స్, 1,71,155 పన్ను చెల్లింపుదారులకు .70,540 కోట్ల కార్పోరేట్ పన్ను రీఫండ్స్ చెల్లించింది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకుంటోంది.

కరోనా.. వెసులుబాటు
కోవిడ్ 19 కారణంగా ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నాయి. ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేందుకు కేంద్రం వివిధ చర్యలు తీసుకుంటోంది. పీఎఫ్ అకౌంట్ నుండి ఉద్యోగులు మూడు నెలల వేతనం లేదా 75 శాతం.. ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తం తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీని కూడా పొడిగించి వెసులుబాటు ఇస్తోంది. తాజాగా 2019-20 ఆర్థిక అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీ రిటర్న్స్) దాఖలుకు గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) బుధవారం తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications