Infosys: చాలా కాలంగా వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇన్ఫోసిస్ చెప్పిన వార్తతో ఉద్యోగుల్లో సంతోషం ఉప్పొంగుతోంది. అన్ని కంపెనీల మాదిరిగా కాకుండా సంస్థ మంచి హైక్ ప్రకటించటంతో టెక్కీలు తెగ సంతోషంగా ఉన్నారు.

జీతాల పెంపు ఇలా..
ఐటీ సేవల దిగ్గజం తన ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో వారి పనితీరుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. తన మెుత్తం ఉద్యోగుల్లో ఎక్కువ మందికి 10-13% వరకు జీతాల పెంపును ప్రకటించింది. అయితే అత్యుత్తమ పనితీరు కనబరిచిన కొదరికి మాత్రం 20-25% హైక్ అందించింది. బెస్ట్ పర్ఫామర్స్ కి డబుల్ బోనస్ అందించటం పట్ల టెక్కీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఖర్చులు తగ్గిస్తూ..
దేశంలోనే రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజంగా ఉన్న ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మంచి వేతన పెంపును ప్రకటిస్తూనే.. ఆన్-సైట్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, వినియోగ స్థాయిలను పెంచడం వంటి పద్ధతుల్లో ఖర్చులను తగ్గించుకుంటోంది. జీతాల పెంపుదల ఉద్యోగి గ్రేడ్లపై ఆధారపడి ఉంటుందని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, గ్రూప్ హెడ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ క్రిష్ శంకర్ అన్నారు. సీనియర్ మేనేజ్మెంట్ తక్కువ హైక్ అందుకుంటారని అన్నారు.

అట్రిషన్ విషయంలో..
జూన్ FY23 త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అట్రిషన్ 28.4 శాతంగా ఉంది. ఇది ఇండస్ట్రీ యావరేజ్ కంటే ఎక్కువ. ఉద్యోగుల కెరీర్ గ్రోత్ పెంచడానికి వేగవంతమైన, మరింత ఊహాజనిత ప్రమోషన్లు, రోల్ రొటేషన్లు, డెడికేటెడ్ ప్రోగ్రామ్లను ఉద్యోగులకు అందించేందుకు కంపెనీ అనేక చర్యలు తీసుకుంది.

పెరిగిన ప్రమోషన్లు..
ఐదేళ్ల కిందట ఏడాదికి 8,000-10,000 మంది ఉద్యోగులకు కంపెనీ ప్రమోషన్స్ ఇచ్చేంది. అయితే 2021-22లో కంపెనీ వార్షికంగా 40,000 ప్రమోషన్లను ఇస్తోంది. ఇప్పుడది ఇంకా పెరగవచ్చని గ్రూప్ హెచ్ఆర్ హెడ్ క్రిష్ శంకర్ తెలిపారు. ప్లాటినం క్లబ్ ఆఫ్ టాప్ పెర్ఫార్మర్స్ ద్వారా ఫ్రెషర్ స్థాయి నుంచి మేనేజర్ స్థానానికి చేరుకోవడానికి పట్టే కాలాన్ని తగ్గించే లక్ష్యంతో కంపెనీ ముందుకెళుతున్నట్లు ఆయన గతంలోనే తెలిపారు. ఇన్ఫోసిస్ ఉద్యోగుల్లో 1-2 శాతం మంది ఇప్పుడు ప్లాటినం క్లబ్లో భాగమయ్యారు.
More From GoodReturns

రూ. 12 వేల కోట్ల సామ్రాజ్యం.. ఒక్క తప్పుతో రాత్రికి రాత్రే కుప్పకూలి 74 రూపాయలకు అమ్మకం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications