IT News: ఇటీవల ఐటీ కంపెనీల్లో చాలా కొత్త నిబంధనలు వస్తున్నాయి. పరిస్థితులను పూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు టెక్ కంపెనీలు రూటు మార్చాయి. ఆ క్రమంలో విప్రో 300 మంది మాట వినని ఉద్యోగులను తొలగించటం చాలా పెద్ద దుమారం రేపుతోంది. దీనికి తోడు కంపెనీ క్రమశిక్షణను పెంచేందుకు తాజాగా మరో నిర్ణయం కూడా తీసుకుంది.

విప్రో ప్రకటన..
ఎలాగైనా మూన్లైటింగ్ కు చెక్ పెట్టాలని భావించిన విప్రో తమ ఉద్యోగులకు హైబ్రిడ్ విధానాన్ని అమలులోకి తెస్తోంది. దీని ప్రకారం ఇకపై టెక్కీలు వారానికి మూడు రోజుల పాటు తప్పకుండా కార్యాలయాలకు రావలసి ఉంటుంది. దీనిని అక్టోబర్ 10 నుంచి అమలు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సిబ్బందికి సమాచారం కూడా అందించింది.

మెయిల్ సమాచారం..
కనీసం 4 రోజులలో 3 రోజులు ఆఫీసు నుండి పని చేయవలసిందిగా కంపెనీ ఈ మెయిల్ ద్వారా ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది. దీనివల్ల టీమ్ వర్క్, ఫ్లెండ్లీ నేచర్ ను ఉద్యోగులు ఆస్వాధించగలరని విప్రో తెలిపింది. గత నెలలో ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ టీసీఎస్ కూడా ఇదే తరహాలో ఉద్యోగులను ఆఫీసులకు తప్పక రావలసిందేనని తేల్చి చెప్పింది. టెక్ మహీంద్రా కూడా ఆఫీసులకు రావాలని ఉద్యోగులను కోరింది.

రిటర్న్ టు ఆఫీస్ పాలసీ..
రిటర్న్ టు ఆఫీస్ పాలసీ కింద కంపెనీ హైబ్రిడ్ వర్క్ విధానాన్ని అవలంబిస్తుంది. లీడర్షిప్ రోల్స్లో ఉన్న ఉద్యోగులు అక్టోబర్ 10 నుంచి ఆఫీసులకు తిరిగి వస్తారని వెల్లడించింది. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో కార్యాలయాలు తెరిచి ఉంటాయని వెల్లడించింది. దీనివల్ల మూన్లైటింగ్ సమస్యకు త్వరగా పరిష్కారం దొరుకుతుందని కంపెనీ భావిస్తోంది.

TCS..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న TCS కార్యాలయాలను వినియోగదారులు సందర్శిస్తున్నారని కంపెనీ తెలిపింది. అందువల్ల ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుల నుంచి పనిచేయాలని కోరింది. ఇదే సమయంలో సీనియర్ లెవల్ ఎగ్జిక్యూటివ్లు వారానికి ఐదు రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది.

రోజువారీ కూలీలుగా టెక్కీలు..
చాలా కంపెనీలు ఎంపిక చేసుకున్న ఉద్యోగులను సైతం రిజెక్ట్ చేస్తున్నాయి. తాజాగా డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్ విద్యార్థిని కూడా చెల్లించని రెండు నెలల ఇంటర్న్షిప్ కోసం విప్రో ఎంపిక చేసింది. అలా విప్రోలో ఉద్యోగానికి సెలక్ట్ అయ్యి రవి అనే బీటెక్ విద్యార్థి పొట్టకూటి కోసం రూ.300 కూలీకి నిర్మాణ పనులకు వెళుతున్నాడు. జాబ్ ఆఫర్ వచ్చి నెలరోజులైంది. కానీ తనకు ఇంకా ఉద్యోగం రాలేదని రవి నిరాశలో ఉన్నాడు. రవి లాగా చాలా మంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు మనీ కంట్రోల్ వార్తా సంస్థ ఒక కథనంలో వెల్లడించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications