కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగాల కోత లేదా వేతన కోతకు మొగ్గు చూపుతున్నాయి. ఐటీ కంపెనీలపై కూడా భారీ ప్రభావం పడింది. దిగ్గజ ఐటీ కంపెనీల్లో పెద్దగా ఉద్యోగాల కోత లేనప్పటికీ, ఓపెనింగ్స్ మాత్రం అంతగా ఉండవని చెబుతున్నాయి. అయితే బిజినెస్ లేక.. ఆదాయం లేక చాలా వరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మరిన్ని కంపెనీలు వేతనాల్లో కోత విధిస్తున్నాయి. దీనిపై ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు వెళ్లింది.

సీఎం గారూ.. జోక్యం చేసుకోండి
కరోనా సంక్షోభంలో ఐటీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపుకు, వేతన కోతకు పాల్పడుతున్నారని చెబుతూ ఐటీ ఉద్యోగుల యూనియన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు లేఖ రాసింది. ఐటీ ఉద్యోగుల జీవనోపాధిని కాపాడేందుకు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది. మహారాష్ట్ర వ్యాప్తంగా పలు ఐటీ, అనుబంధ కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయని, వేతనాలు ఇవ్వకుండా కోతలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని జాతీయ ఐటీ ఎంప్లాయీస్ సెనెట్ (NITES) సీఎంకు లేఖ రాసింది.

ఆదేశాలు జారీ చేయాలి
ఉద్యోగాల కోత లేదా వేతన కోత అంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని NITES తెలిపింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఉద్యోగుల హక్కులని కాపాడేలా ప్రభుత్వం ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేయాలని NITES ప్రధాన కార్యదర్శి హర్ప్రీత్ సలుజా అన్నారు. ఈ మేరకు మంగళవారం లేఖ రాశారు. చాలా IT/ITeS/BPO/KPO కంపెనీలు ఉద్యోగాల కోత, వేతన కోతకు పాల్పడుతున్నాయన్నారు.

ఉద్యోగులు బలవుతున్నారు
మహారాష్ట్రలోని ఆరు లక్షల మంది IT/ITeS/BPO/KPO ఉద్యోగులు, వారి కుటుంబాలను కాపాడేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులోను ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలని కోరారు. ప్రస్తుత మహమ్మారితో ఉద్యోగులకు సంబంధం లేదని, కానీ అయినప్పటికీ వారే బలి కావాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగులు తమ ఉద్యోగం కోల్పోతున్నారని, రోజువారీ ఆదాయాన్ని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

68,000 మంది పిటిషన్
చాలామంది ఉద్యోగులకు కనీసం నోటీసు పీరియడ్ ఇవ్వలేదని, ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వడం, కంపన్షేషన్ చెల్లింపులు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ వంటి కార్మిక విధానాలు కూడా అవలంభించడం లేదని తెలిపారు. ఈ లేఖను తాము మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించామని, తమకు రసీదు అందిందని NITES తెలిపింది. దాదాపు 68,000 మంది ఉద్యోగులు అక్రమ తొలగింత, వేతనాల్లో కోత, ఎర్న్డ్ లీవ్స్ డిడక్షన్, బలవంతపు రాజీనామా సహా వివిధ రకాల పిటిషన్లను లేబర్ కమిషనర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ముందు దాఖలు చేశారని తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..



Click it and Unblock the Notifications