టెక్ దిగ్గజం ఇంటెల్ ఇండియా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఐఐఐటీ హైదరాబాద్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(PHFI), తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. హెల్త్ కేర్, స్మార్ట్ మొబిలిటీ వంటి కీలక రంగాల్లో సవాళ్ళను పరిష్కరించడంపై దృష్టి సారిస్తారు. సోమవారం ఆల్.ఏఐ 2020 వర్చువల్ సదస్సులో భాగంగా ఐఎన్ఏఐ కేంద్రాన్ని ప్రారంభించింది.

స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు..
సామాజికాభివృద్ధి కోసం ప్రపంచ ప్రతిభను ఆకర్షించడం కోసం ఏఐలో సరికొత్త ఆవిష్కరణలు, క్యూరేటెడ్ డేటా సెట్స్, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్టార్టప్ వ్యవస్థాపకతను ప్రోత్సహించడంలో ఇది అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. పరిశ్రమలు, విద్యాసంస్థలు,ప్రభుత్వ సహకారంతో భారత్ కృత్రిమ మేధ రంగంలో మరింత ముందుకు దూసుకెళ్లేందుకు ఐఎన్ఏఐ తోడ్పడుతుందని ఇంటెల్ తెలిపింది. అప్లైడ్ పరిశోధన, ఆధునాతన కృత్రిమ మేధ తదితరాల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తోడ్పడటమే దీని లక్ష్యమని తెలిపింది.

టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న భారత్
భారత్ సరికొత్త టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకుంటోందని, ఆరోగ్య సంరక్షణ, స్మార్ట్ మొబిలిటీ రంగాల్లోని అనేక సమస్యల పరిష్కారానికి ఇది అవసరమని ఇంటెల్ ఇండియా కంట్రీ హెడ్, ఇంటెల్ కార్పోరేషన్ డేటా ప్లాట్ఫామ్స్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నివృతి రాయ్ అన్నారు. అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏర్పాటు ద్వారా భారత్ను ఏఐకి మారుపేరుగా చేసే ప్రయత్నమన్నారు.

కీలక మైలురాయి.. కేటీఆర్
హైదరాబాద్ నగరంలో కృత్రిమ మేధస్సు పరిశోధనా కేంద్రం ఐఎన్ఏఐ ప్రారంభం మన సాంకేతికీకరణ ప్రయాణంలో మరో మైలురాయి అని ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు, అత్యుత్తమ పాలన అందించడం కోసం ఇది అవసరమన్నారు. మన కృత్రిమ మేధ దృక్పథం సాకారానికి సమకాలిక ప్రయత్నంతో కలిసి పని చేసేందుకు ఈ సెంటర్ అందరికీ ముఖ్యమని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications