ఫ్రాన్స్లో ప్రభుత్వ ఆస్తుల జఫ్తు వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ గురువారం స్పందించింది. ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ఫ్రెంచ్ కోర్టు నుండి తమకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేసింది. ప్యారిస్లోని భారత ప్రభుత్వ ఆస్తులను కెయిర్న్ ఎనర్జీ జఫ్తు చేసుకున్నట్లు కొన్ని మీడియాలలో కథనాల వస్తున్నాయని, ఇందుకు సంబంధించి ఫ్రెంచ్ కోర్టు నుండి తమకు ఎలాంటి నోటీసులు, ఉత్తర్వులు లేదా సమాచారం రాలేదని ఆర్థిక శాఖ తెలిపింది.
ఈవార్తల్లోని నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఒకవేళ అలాంటి ఉత్తర్వులు వస్తే అందుకు తగిన విధంగా న్యాయపరమైన చర్యలు చేపడతామని, భారత ప్రయోజనాలను కాపాడుతామని ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కెయిర్న్ ఎనర్జీకి సంబంధించి రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో గత ఏడాది ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని ఈ ఏడాది మార్చి 22వ తేదీన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టులో భారత్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపింది. ఈ వివాదం పరిష్కారం కోసం కెయిర్న్ సీఈవో, ప్రతినిధులు కేంద్రంతో చర్చలు జరిపారని గుర్తు చేసింది. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు సిద్ధమని తెలిపింది.

బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీ పీఎల్సీ రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో భారత్కు గట్టి షాక్ తగిలినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అర్బిట్రేషన్ కోర్టు ఆదేశాల ప్రకారం డబ్బులు చెల్లించనందుకు గాను ఫ్రాన్స్లోని భారత ప్రభుత్వ ఆస్తుల జఫ్తుకు అవసరమైన న్యాయప్రక్రియను బుధవారం పూర్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఫ్రెంచ్ కోర్టు అనుమతుల మేరకు వీటిని స్వాధీనం చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్లోని 20 భారత ప్రభుత్వ ఆస్తుల స్వాధీనానికి న్యాయ ప్రక్రియ పూర్తి చేసినట్లుగా చెబుతోంది.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications