దావోస్: అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) భారత వృద్ధి రేటు అంచనాను తగ్గించింది. 2020లో 4.8 శాతంగా ఉండనుందని సోమవారం పేర్కొంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సెక్టార్, బలహీన గ్రామీణ ఆదాయం పెరుగుదల వృద్ధిరేటు తగ్గించడానికి గల కారణాలని విశ్లేషించింది. భారత్తో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మందగమనం కారణంగా IMF వృద్ధి రేటును తగ్గించిన నేపథ్యంలో చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్ మాట్లాడారు.

భారత్ ప్రధాన కారణం..
ప్రపంచ వృద్ధి రేటు తగ్గడానికి భారత్ కూడా ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వృద్ధి రేటును 2019కి గాను 2.9 శాతం, 2020కి గాను 3.3 శాతం అంచనా వేశామని, కానీ ఇందులో ఎక్కువగా భారత్ వంటి దేశాల మందగమనమే కారణమని అభిప్రాయపడ్డారు.

80 శాతం బాధ్యత ప్రపంచానిదే..
భారత దేశంలోని ఆర్థిక మందగమనం ప్రపంచ అంచనాలను ఎంత వరకు ప్రభావితం చేసిందని అడగగా.. దాదాపు 80 శాతానికి పైగా ప్రభావితం చేసి ఉండి ఉంటుందని గీతా గోపినాథ్ అన్నారు. IMF భారత వృద్ది రేటును 2019కి గాను 4.8 శాతం అంచనా వేయగా, 2020లో 5.8 శాతం, 2021లో 6.5 శాతం అంచనా వేస్తోంది.

భారత్ కోలుకుంటోంది..
భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై గీతా గోపినాథ్ మాట్లాడుతూ... భారత్ క్రమంగా కోలుకోవడాన్ని మనం చూస్తున్నామని, వచ్చే ఏడాది గణనీయంగా రికవరీ కానుందని, వ్యవస్థ అవసరమైన ద్రవ్య ఉద్దీపనలు కలిగి ఉందని, కార్పోరేట్ పన్నును కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, రానున్న ఏడాదిలో వృద్ధి పట్టాలు ఎక్కించేందుకు ఇవి ఉపకరిస్తాయని చెప్పారు. నిరర్థక ఆస్తుల గురించి స్పందిస్తూ.. ప్రభుత్వం ముందు ఉన్న అతి పెద్ద సవాల్ అన్నారు.
చిదంబరం ఏమన్నారంటే?
IMF భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించిన నేపథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం స్పందించారు. ఇక మంత్రులు IMF, భారత్లో జన్మించిన చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్పై విమర్శలు గుప్పిస్తారేమోనని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దును గీతా వ్యతిరేకించారన్నారు. అంతేకాదు, వృద్ధి రేటు అంచనా 4.8 శాతం కంటే తగ్గినా ఆశ్చర్యం లేదేమో అని ట్వీట్ చేశారు.

వృద్ధి రేటు 4.8 శాతమే..
భారత వృద్ధిరేటు అంచనాలను 2020కి గానూ 4.8శాతంకు తగ్గించిన విషయం తెలిసిందే. 2021 ఆర్థిక సంవత్సరానికి ఈ అంచనా వృద్ధిరేటు 5.8 శాతం ఉండనుందని వెల్లడించింది. 2022 ఆర్థిక సంవత్సరం నాటికి భారత వృద్ధిరేటు 6.5 శాతానికి చేరుకుంటుందని పేర్కొంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టార్, క్రెడిట్ గ్రోత్ క్షీణత కారణంగా భారత వృద్ధిరేటు అంచనాల తగ్గుదలకు కారణమయ్యాయని తెలిపింది. భారత దేశీయ డిమాండ్ అనుకున్నదానికంటే వేగంగా పడిపోయిందని పేర్కొంది. అదే విధంగా అంతర్జాతీయ వృద్ధిరేటును కూడా ఐఎంఎఫ్ తగ్గించింది. 2019లో అంచనా వృద్ధిరేటు 2.9శాతానికి, 2020కి 3.3శాతానికి, 2021 ఆర్థిక సంవత్సరానికి 3.4శాతానికి తగ్గించింది. రానున్న రెండేళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ భారత్ లాంటి దేశాలు వృద్ధిరేటును సల్పంగా పెంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని తెలిపింది. ఎమర్జింగ్ మార్కెట్, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు 2019లో 3.7శాతం ఉంటే, 2020 నాటికి 4.4శాతంగా, 2021లో 4.6శాతానికి పెరుగుదల నమోదు చేస్తాయని అంచనా వేసింది. 0.2శాతం పెరుగుదులను నమోదు చేస్తున్నాయని వెల్లడించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications