భారత జీడీపీ వృద్ధి రేటు మైనస్ 11.8 శాతం, ఇండియా రేటింగ్స్ అంచనా
2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు మైనస్ 11.8 శాతం ఉండవచ్చునని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. గతంలో మైనస్ 5.3 ఉండగా, తాజాగా రెండింతల కంటే ఎక్కువ ప్రతికూలత నమోదు చేస్తుందని అంచనా వేసింది. అదే సమయంలో 2021-222 నాటికి జీడీపీ వృద్ధి రేటు 9.9 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. భారత చరిత్రలో ఈ జీడీపీ వృద్ధి రేటు (మైనస్ 11.8 శాతం) కనిష్టం. ఈ స్థాయికి జీడీపీ ఎప్పుడూ పతనం కాలేదు.
భారత ఆర్థికవ్యవస్థ -10.5%, ఫిచ్ రేటింగ్ భారీ కోత
1951 నుండి అందుబాటులో ఉన్న జీడీపీ డేటా ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ ఐదుసార్లు ప్రతికూలత నమోదు చేసంది. FY-1958, FY-1966, FY-1967, FY-1973, FY-1980 కాగా, ఈ ఆర్థిక సంవత్సరం ఆరోసారి. అంతకుముందు 1980లో 5.2 శాతం ప్రతికూలత నమోదు చేసింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో భారత జీడీపీ 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక నష్టం రూ.18.44 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా.
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ కూడా 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ రేటుకు భారీ కోత విధించింది. దాదాపు 10.5శాతం మేర ప్రతికూలత నమోదు చేస్తుందని అంచనా వేస్తుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత జీడీపీ 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసింది. రానున్న రెండు క్వార్టర్లలోను ప్రతికూలత నమోదు కావొచ్చునని, నాలుగో క్వార్టర్లో మాత్రం కాస్త పుంజుకోవచ్చునని అంచనా వేస్తున్నారు.