న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశం కరెంట్ ఖాతా మిగులును నమోదు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదార కేవీ సుబ్రమణియన్ అన్నారు. కరోనా నేపథ్యంలో దిగుమతులు క్షీణించాయని, దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత కరెంట్ అకౌంట్ మిగులును నమోదు చేయవచ్చునని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉందని, అయితే మనపై ప్రభావం కాస్త భిన్నంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీ బాడీ సీఐఐ నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు.

ఇది భిన్నమైన సంక్షోభం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 20 బిలియన్ డాలర్ల (19.8 బిలియన్ డాలర్లు) కరెంట్ ఖాతా మిగులు ఉందని, తర్వాత త్రైమాసికాల్లో కరెంట్ ఖాతా ఈ స్థాయి మాదిరి నమోదు కానప్పటికీ పూర్తి సంవత్సరానికి కరెంట్ ఖాతా మిగులు కనిపించే అవకాశాలు ఉన్నాయని సుబ్రమణియన్ అన్నారు. మహమ్మారి కారణంగా స్వల్పకాలంలో వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడిందని, ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మధ్య, దీర్ఘకాలంలో కరోనా ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదని తెలిపారు. గతంలో వచ్చిన ఆర్థిక సంక్షోభాలతో పోలిస్తే ప్రస్తుత సంక్షోభం భిన్నమని చెప్పారు.

ప్రభుత్వం భేషై నిర్ణయాలు
కరోనాను భారత్ ముందుగానే గుర్తించి కఠిన చర్యలు తీసుకుందని ప్రపంచంలోనే సుదీర్ఘ లాక్ డౌన్తో పాటు వివిధ ప్రభుత్వ చర్యలను ఉద్దేశించి అన్నారు. కరోనా ఉదృతిని తగ్గించే చర్యలతో పాటు, ఆర్థిక వ్యవస్థ పుంజుకునే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కరోనా సంక్షోభంలో ఎక్కువగా ప్రభావం పడింది డిమాండ్ పైన అని గుర్తు చేశారు. కరోనా ప్రభావం నుండి ఆర్థిక వ్యవస్థను బయటపడేయడంలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించిందన్నారు.

అనేక సంస్కరణలు
ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందన్నారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ తీసుకు వచ్చిందని, ఆ తర్వాత దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న వ్యవసాయ, కార్మిక సంస్కరణలు ఉన్నాయన్నారు. వ్యవసాయ సంస్కరణలు, ఎంఎస్ఎంఈ అర్థంలో మార్పులు, పనితీరు అనుసంధాన ప్రోత్సాహకాలు ఇలా ఎన్నో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ స్వావలంభన కోసం అన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications