కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రకటించిన వివిధ ఉద్దీపన ప్యాకేజీలను ఉపసంహరించుకోవడానికి ఎలాంటి తొందరలేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ రికవరీకి అవసరమైతే మరిన్ని చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. 'అవి కొనసాగుతాయి' అని ఉద్దీపన ప్యాకేజీని ఉద్దేశించి నిర్మలమ్మ న్యూయార్క్ సండేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కరోనా ప్రభావాన్ని అధిగమించడానికి చిన్న వ్యాపారులకు, పరిశ్రమలకు, సామాన్యులకు ఎన్నో ప్రయోజనాలు కేంద్రం కల్పించింది. వీటిని మరింత కాలం కొనసాగిస్తామని తెలిపారు. ఆరోగ్య మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రాధాన్యత కొనసాగుతుందన్నారు. నిర్మలా సీతారామన్ వచ్చే ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు.

సప్లై చైన్
కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రకటించిన పలు ఉద్దీపన పథకాలను ఉపసంహరించేందుకు తొందర ఏమీ లేదని తేల్చి చెప్పారు. తద్వారా మరింతకాలం ఉపశమన చర్యలు కొనసాగే అవకాశముందని సంకేతాలిచ్చారు. అయితే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను త్వరితగతిన గాడిన పెట్టాలనే తమ లక్ష్యంలో కొంత అస్థిరత తలెత్తే అవకాశముందన్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పటికే మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం భారీ ఎత్తున ఖర్చు చేసేందుకు సిద్ధమైందని తెలిపారు. కొవిడ్ 19ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల సహకారం అవసరమన్నారు. అలాగే సప్లై చైన్ను కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో వినియోగించే ముడి సరకుల నిమిత్తం నిరంతరం తెరిచే ఉంచాలన్నారు.

చమురు ధరలపై ఆందోళన
ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా, జాతీయంగా చమురు ధరల పెరుగుదల పెద్ద సవాల్ అని, ఆర్థికమంత్రిత్వ శాఖకు చెందిన టీమ్ కూడా పరిశీలిస్తోందన్నారు. ఈ అనిశ్చితి తమ ముందున్న అతిపెద్ద సవాల్ అన్నారు. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్లో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను విక్రయించడం జరుగుతోంది. అలాగే పెట్టుబడుల మూలధనం కోసం విదేశీ రుణ ప్రవాహాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ అంశంపై కూడా ఆమె స్పందించారు. ఎల్ఐసీ లిస్టింగ్ ఈ ఏడాది పూర్తవుతుందా అని అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ దీనిని పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు.

జీడీపీ వృద్ధి రేటు
కరోనా నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఫస్ట్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ సెకండ్ వేవ్ ప్రభావం కొంతమాత్రమే కనిపించింది. భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో వివిధ రేటింగ్ ఏజెన్సీలు FY22 జీడీపీ వృద్ధి రేటు అంచనాలను సవరిస్తున్నాయి. కేంద్ర బ్యాంకు ఆర్బీఐ అంచనాల ప్రకారం భారత జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతంగా నమోదు కావొచ్చు. గత ఏడాది మైనస్ 7.3 శాతంగా నమోదయింది. బ్లూమ్బర్గ్ అంచనాలప్రకారం 7.8 శాతంగా ఉండవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications