కరోనా మహమ్మారి సంక్షోభాన్ని భారత్ ఒక అవకాశంగా మలుచుకుందని, కేవలం ఉద్దీపన చర్యలకే పరిమితం కాకుండా నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వాషింగ్టన్లో జరుగుతున్న ప్రపంచబ్యాంకు అభివృద్ధి కమిటీ సమావేశంలో గురువారం ఆమె మాట్లాడారు. కరోనా సంక్షోభ సమయంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్కు 82 బిలియన్ డాలర్ల FDIలు వచ్చాయన్నారు. భారత్ పెట్టుబడులకు స్వర్గదామమని ఇది సూచిస్తోందన్నారు. కరోనాను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందన్నారు.
జీవితం, జీవనాధారం... రెండింటి లక్ష్యంగా చర్యలు చేపట్టామన్నారు. కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా ఒకేసారి వెలుగు చూడలేదన్నారు. దీంతో స్థానిక లాక్డౌన్ ద్వారా కట్టడి చేశామన్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడలేదన్నారు. సెకండ్ తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ 20.1 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందన్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో భారత్ 20.1 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని గుర్తు చేశారు. సెకండ్ వేవ్ అనంతరం ఆంక్షలు ఎత్తివేశాక గత మూడు నెలలుగా జీఎస్టీ వసూళ్లు లక్షకోట్ల రూపాయలు దాటుతున్నాయన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందనడానికి ఇది ఒక నిదర్శనం అన్నారు. రానున్న నెలల్లో మరింత జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. వ్యాక్సీన్ పంపిణీ విషయంలో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని చెప్పారు. సెప్టెంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా 951.35 మిలియన్ డోసులు పంపిణీ చేసినట్లు చెప్పారు. పద్దెనిమిదేళ్లు పైబడిన వారిలో 72.8 శాతం మందికి కనీసం ఒక డోస్ వ్యాక్సీన్ అందినట్లు తెలిపారు. అలాగే వ్యాక్సిన్ మైత్రి పేరిట ప్రపంచదేశాలకు వీటిని అందించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ కోసం రూపొందించిన కొవిన్ యాప్ కొవిడ్పై పోరులో ప్రపంచవ్యాప్తంగా సమర్థమైన సాధనంగా మారిందన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications