కరోనా మహమ్మారి ప్రభావం భారత్ సహా ప్రపంచ దేశాలపై భారీగా ఉంటుందని సింగపూర్ బ్రోకరేజీ సంస్థ డీపీఎస్ బుధవారం పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రాష్ట్రాల్లో ఇంకా కరోనా ప్రభావం తగ్గలేదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6 శాతం ప్రతికూలత నమోదు కావొచ్చునని డీబీఎస్ నివేదిక తెలిపింది. అంతకుముందు ఇదే సంస్థ మైనస్ 4.8 శాతంగా అంచనా వేసింది. ఇప్పుడు మరింత ప్రభావం ఉంటుందని చెబుతూ, వృద్ధి రేటును సవరించింది.

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కీలక రాష్ట్రాలు ఇలా..
ఈ నివేదిక ప్రకారం భారత్కు ఆర్థికంగా కీలకమైన పలు రాష్ట్రాలు ఇంకా కరోనా మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. జాతీయ ఆర్థిక ఉత్పత్తిలో 30.5 శాతానికి సమానమైన మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అలాగే, ఆర్థిక వ్యవస్థకు ఇతర కీలక రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి తెలుగు రాష్ట్రం)లలో ఆయా రాష్ట్రాలకు 70 శాతం వాటా కలిగిన ప్రాంతాలు కరోనా బారిన పడ్డాయని అభిప్రాయపడింది.

ఆర్థిక వ్యవస్థ మరింత కుంచించుకుపోయేలా..
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కీలక రాష్ట్రాలలో కేసులు పెరుగుతుండటం భారత రికవరీ ఆలస్యానికి కారణంగా మారుతోందని, అలాగే ఆర్థిక వ్యవస్థ మరింత కుంచించుకుపోయేలా చేస్తోందని డీబీఎస్ నివేదిక తెలిపింది. భారత్లో కరోనా కేసులు 12 లక్షలు దాటాయి. మరణాలు 29 వేలకు చేరువయయాయి. అమెరికా, బ్రెజిల్ తర్వాత ఎక్కువ కేసులు ఉన్న దేశంగా భారత్ నిలిచింది. అన్-లాక్ అయినప్పటికీ కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా ప్రారంభం కావడం లేదని ఈ పరిస్థితుల్లో FY21లో ఆర్థిక వృద్ధిని మైనస్ 6 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు డీబీఎస్ ఎకనమిస్ట్ రాధిక రావు అన్నారు.

మరోసారి ఆర్థిక ప్యాకేజీ
ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో రెండంకెల ప్రతికూలత నమోదు చేస్తుందని, రెండో త్రైమాసికంలో కాస్త పుంజుకుంటుందని, మూడో త్రైమాసికానికి వృద్ధి బాట పడుతుందని రాధిక రావు తెలిపారు. జాతీయ జీడీపీలో మహారాష్ట్ర వాటా 14 శాతం, తమిళనాడు వాటా 8.5 శాతం, గుజరాత్ వాటా 8 శాతంగా ఉండగా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వాటా జాతీయ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు. పలు నగరాల్లో లాక్ డౌన్ కొనసాగుతోందని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మరో విడత ఆర్థిక ప్యాకేజీ కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications