OTPకి సంబంధించి సోమవారం అంతరాయం ఏర్పడింది. వాణిజ్య సందేశాల నియంత్రణ కోసం టెల్కోలు సోమవారం నుండి కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చాయి. అయితే ఈ కొత్త నిబంధనలు గందరగోళానికి దారితీశాయి. దీంతో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు చెల్లింపులు, రైల్వే టిక్కెట్ బుకింగ్, ఈ-కామర్స్, ఆధార్ ధృవీకరణ, కోవిన్ దరఖాస్తు వంటి ఆన్లైన్ సేవల్లో అంతరాయం కలిగింది.
ఎస్సెమ్మెస్, OTP సందేశాలు కస్టమర్లకు రాలేదు. సోమవారం సాయంత్రం వరకు దాదాపు 40 శాతం సందేశాలు నిలిచిపోయాయి. టెల్కోలు అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనలతో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ సమస్య వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇటు టెలికం కంపెనీలు, అటు పేమెంట్ వంటి ఇతరసంస్థలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి.

కొత్త నిబంధనలను అమలు చేసే ప్రక్రియలో కంపెనీలు చేసిన తప్పిదం అంతరాయానికి కారణమైనట్లు టెలికం సంస్థలు వెల్లడించాయి. సందేశాలు పంపించేవారి ఐడీలను కొత్తగా తీసుకు వచ్చిన బ్లాక్ చైన్ ప్లాట్ఫాంపై రిజిస్టర్ చేయకపోవడం వల్ల సందేశాలు వెళ్లలేదని తెలిపాయి. వాణిజ్య సందేశాలకు సంబంధించి మూడేళ్ల క్రితం ట్రాయ్ కొత్త నిబంధనలు జారీ చేయగా, ఇవి నిన్నటి నుండి అమల్లోకి వచ్చాయి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications