ముంబై: విధానాల అనుకూలంగా ఉంటే 'తక్కువ ధరకు తయారీ'లో చైనాను భారత్ అధిగమించగలదని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. ప్రభుత్వం, పరిశ్రమ సమన్వయంతో పని చేస్తే తక్కువ ధరకు తయారు చేయగలమన్నారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (AIMA) నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. భారతీయ పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారతీయ తయారీని అంతర్జాతీయంగా పోటీలో నిలపడంపై ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు.

అప్పుడే తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వస్తువులు
భారతీయ పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యం కావాలని ఆర్సీ భార్గవ అన్నారు. అప్పుడు అతి తక్కువ ఖర్చుతో, ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యతతో వస్తువులను తయారు చేయగలమన్నారు. పరిశ్రమ ఎంత ఎక్కువగా విక్రయించగలిగితే అంత ఎక్కువగా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, అలాగే ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందన్నారు. మారుతీ సుజుకీ ప్రతి సంవత్సరం శ్రామికశక్తిని ఎక్కువగా జోడించకుండానే తన సేల్స్ మాత్రం పెంచుకుంటోందన్నారు. తద్వారా సర్వీస్ సెక్టార్లో ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తోందన్నారు.

పోటీపడే స్థాయికి తీసుకెళ్లాలంటే
భారతీయ తయారీ పరిశ్రమను అంతర్జాతీయంగా పోటీపడే స్థాయికి తీసుకు వెళ్లడానికి ఏం చేయాలనే అంశాలపై మాట్లాడుతూ.. భారతీయ పరిశ్రమలో పోటీతత్వాన్ని పెంచడానికి వీలుగా ప్రభుత్వం పలు విధానాలను తీసుకు రావాలని, తద్వారా ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తులను తయారీ పరిశ్రమ అందించగలుగుతుందన్నారు. విక్రయాలు ఎంతగా పెరిగితే అంత ఉద్యోగాల సృష్టి ఉంటుందన్నారు.

ఆ నిబంధనలు సరికాదు
విక్రయాలు పెరిగితే, ఉద్యోగాలు పెరిగి ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో పయనిస్తుందని ఆర్సీ భార్గవ అన్నారు. కొన్ని రాష్ట్రాల్లోని తయారీ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ నిబంధనలు తేవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇది పోటీతత్వానికి వ్యతిరేక చర్య అన్నారు. ఎంఎస్ఎంఈలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద కంపెనీల స్థాయిలో పోటీ పడాలన్నారు.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

ఇరాన్ యుద్ధం వేళ అమెరికాను చావు దెబ్బ కొట్టిన చైనా.. బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యంపై కొత్త వార్..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications