12 ఏళ్లలో మొదటిసారి: కార్పోరేట్ ట్యాక్స్ను అధిగమించిన ఇన్కం ట్యాక్స్ వసూళ్లు
భారత ప్రభుత్వానికి గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) వచ్చిన పన్ను ఆదాయంలో కార్పొరేట్ ట్యాక్స్ కంటే ఇన్కం ట్యాక్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం వచ్చింది. కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా వచ్చిన మొత్తం కంటే ఇన్కం ట్యాక్స్ ద్వారా ఎక్కువ ఆదాయం రావడం 12 ఏళ్లలో ఇది తొలిసారి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడవుతోంది.
ఆదాయ పన్ను వ్యక్తుల ఆదాయంపై వేసేది. కంపెనీల లాభాలపై వేసే పన్ను కార్పోరేట్ ట్యాక్స్. ఇలా 2020-21 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో రూ.4.57 లక్షల కోట్లు రాగా, ఇన్కం ట్యాక్స్ రూపంలో రూ.4.69 లక్షల కోట్లు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 18 శాతం, ఇన్కం ట్యాక్స్ వసూళ్లు 2.3 శాతం క్షీణించాయి.
అమెరికా, భారత్ సహా బేజారు, చైనా, టర్కీ మాత్రమే అదుర్స్
నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక 10 శాతం మేర కార్పొరేట్ ట్యాక్స్ను (25 శాతానికి) తగ్గించింది. దీంతో కార్పొరేట్ పన్ను వసూళ్లు తగ్గాయి. పైగా 2019లో ఆర్థిక మందగనం, 2020, 2021లో కరోనా సంక్షోభం కారణంగా కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు తగ్గాయి. 2018-19లో 6.6 లక్షల కోట్లుగా ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 2019-20లో 16 శాతం, 2020-21లో 18 శాతం క్షీణించాయి. మొత్తం 31 శాతం తగ్గాయి.