గత రెండున్నర దశాబ్దాలుగా భారత్లో ఆర్థిక సరళీకరణలు కనిపిస్తున్నాయి. దేశంలోని 20 శాతం పేదవారి ఆదాయం 1995 నుండి ఆర్థిక సరళీకరణ అనంతరం క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే కరోనా మహమ్మారి వారి ఆదాయాలపై తద్వారా జీవితాలపై పెను ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో పేద భారత కుటుంబాల వార్షిక ఆదాయం 2015-16 స్థాయి నుండి ఈ మహమ్మారి సమయంలో 53 శాతం పడిపోయింది. ఇదే అయిదేళ్ల కాలంలో ధనవంతులైన 20 శాతం మంది వార్షిక ఆదాయం 39 శాతం వృద్ధిని నమోదు చేసింది. కరోనా సమయంలో ధనిక-పేద కుటుంబాల మధ్య పెరిగిన వ్యత్యాసాన్ని ఇది చూపిస్తోంది.

కే షేప్ రికవరీ
ముంబైకి చెందిన థింక్ ట్యాంక్ పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ (PRICE) నిర్వహించిన ICE360 సర్వే 2021లో కరోనా తర్వాత భారత రికవరీ K షేప్లో ఉన్నదని వెల్లడైంది. ఈ సర్వే ఏప్రిల్-అక్టోబర్ కాలంలో నిర్వహించారు. మొదటి రౌండ్లో 2,00,000 కుటుంబాలను, రెండో రౌండ్లో 42,000 కుటుంబాలను సర్వే చేశారు.
ఇది దేశంలోని 100 జిల్లాల్లో 120 పట్టణాల్లో, 800 గ్రామాల్లో జరిగింది. కరోనా నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు త్రైమాసికాల్లో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో జీడీపీ వృద్ధి రేటు ఆ ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.3 శాతానికి పడిపోయింది.

ఎవరి ఆదాయం ఎంత తగ్గిందంటే
కరోనా మహమ్మారి కారణంగా గ్రామీణ పేదల కంటే పట్టణ పేదలు ఎక్కువగా నష్టపోయినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. పట్టణ పేదల ఆదాయం భారీగా తగ్గింది. ఆదాయం ఆధారంగా జనాభాను ఐదు వర్గాలుగా విభజించగా.. కరోనా ప్రభావంతో 20 శాతం మంది పేదల ఆదాయం 53 శాతం తగ్గింది. అదే కాలంలో 20 శాతం మంది దిగుమ మధ్య తరగతి ఆదాయం 32 శాతం తగ్గింది. మిడిల్ క్లాస్ ఆదాయం 9 శాతానికి తగ్గింది. 20 శాతం ఎగువ మధ్య, 20 శాతం ధనవంతుల ఆదాయం వరుసగా 7 శాతం, 39 శాతం పెరిగింది.

ధనికులు.. పేదల ఆదాయం
20 శాతం సంపన్న కుటుంబాలు సరళీకరణ తర్వాత (1995) మొదటిసారి ఓ అయిదేళ్లలో ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకున్నాయని ఈ సర్వే వెల్లడిస్తోంది. అదే సమయంలో 20 శాతం పేదల ఆదాయం భారీగా తగ్గింది. కరోనా కారణంగా పేదలు, మధ్య తరగతిపై భారీ దెబ్బ పడింది. 1995లో 20 శాతం మంది ధనవంతుల ఆదాయం మొత్తం హౌస్ హోల్డ్ ఆదాయంలో 50.2 శాతం కాగా, 2021 నాటికి ఇది 56.3 శాతానికి పెరిగింది. అదే సమయంలో 20 శాతం పేదల ఆదాయం 5.9 శాతం నుండి 3.3 శాతానికి తగ్గింది.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications