గత రెండున్నర దశాబ్దాలుగా భారత్లో ఆర్థిక సరళీకరణలు కనిపిస్తున్నాయి. దేశంలోని 20 శాతం పేదవారి ఆదాయం 1995 నుండి ఆర్థిక సరళీకరణ అనంతరం క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే కరోనా మహమ్మారి వారి ఆదాయాలపై తద్వారా జీవితాలపై పెను ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో పేద భారత కుటుంబాల వార్షిక ఆదాయం 2015-16 స్థాయి నుండి ఈ మహమ్మారి సమయంలో 53 శాతం పడిపోయింది. ఇదే అయిదేళ్ల కాలంలో ధనవంతులైన 20 శాతం మంది వార్షిక ఆదాయం 39 శాతం వృద్ధిని నమోదు చేసింది. కరోనా సమయంలో ధనిక-పేద కుటుంబాల మధ్య పెరిగిన వ్యత్యాసాన్ని ఇది చూపిస్తోంది.

కే షేప్ రికవరీ
ముంబైకి చెందిన థింక్ ట్యాంక్ పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ (PRICE) నిర్వహించిన ICE360 సర్వే 2021లో కరోనా తర్వాత భారత రికవరీ K షేప్లో ఉన్నదని వెల్లడైంది. ఈ సర్వే ఏప్రిల్-అక్టోబర్ కాలంలో నిర్వహించారు. మొదటి రౌండ్లో 2,00,000 కుటుంబాలను, రెండో రౌండ్లో 42,000 కుటుంబాలను సర్వే చేశారు.
ఇది దేశంలోని 100 జిల్లాల్లో 120 పట్టణాల్లో, 800 గ్రామాల్లో జరిగింది. కరోనా నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు త్రైమాసికాల్లో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో జీడీపీ వృద్ధి రేటు ఆ ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.3 శాతానికి పడిపోయింది.

ఎవరి ఆదాయం ఎంత తగ్గిందంటే
కరోనా మహమ్మారి కారణంగా గ్రామీణ పేదల కంటే పట్టణ పేదలు ఎక్కువగా నష్టపోయినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. పట్టణ పేదల ఆదాయం భారీగా తగ్గింది. ఆదాయం ఆధారంగా జనాభాను ఐదు వర్గాలుగా విభజించగా.. కరోనా ప్రభావంతో 20 శాతం మంది పేదల ఆదాయం 53 శాతం తగ్గింది. అదే కాలంలో 20 శాతం మంది దిగుమ మధ్య తరగతి ఆదాయం 32 శాతం తగ్గింది. మిడిల్ క్లాస్ ఆదాయం 9 శాతానికి తగ్గింది. 20 శాతం ఎగువ మధ్య, 20 శాతం ధనవంతుల ఆదాయం వరుసగా 7 శాతం, 39 శాతం పెరిగింది.

ధనికులు.. పేదల ఆదాయం
20 శాతం సంపన్న కుటుంబాలు సరళీకరణ తర్వాత (1995) మొదటిసారి ఓ అయిదేళ్లలో ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకున్నాయని ఈ సర్వే వెల్లడిస్తోంది. అదే సమయంలో 20 శాతం పేదల ఆదాయం భారీగా తగ్గింది. కరోనా కారణంగా పేదలు, మధ్య తరగతిపై భారీ దెబ్బ పడింది. 1995లో 20 శాతం మంది ధనవంతుల ఆదాయం మొత్తం హౌస్ హోల్డ్ ఆదాయంలో 50.2 శాతం కాగా, 2021 నాటికి ఇది 56.3 శాతానికి పెరిగింది. అదే సమయంలో 20 శాతం పేదల ఆదాయం 5.9 శాతం నుండి 3.3 శాతానికి తగ్గింది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications