హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(HCIL) ఉత్తర ప్రదేశ్లోని తన గ్రేటర్ నోయిడా ప్లాంట్ను క్లోజ్ చేస్తోందని తెలుస్తోంది. జపానీస్ ఆటో దిగ్గజం హోండా మోటో కంపెనీ గ్రేటర్ నోయిడాలో 1997లో ప్లాంటును ప్రారంభించింది. ప్లాంట్ను క్లోజ్ చేసినప్పటికీ కంపెనీ కార్పోరేట్ కార్యాలయం, స్పేర్ పార్ట్స్ డివిజన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) కేంద్రం వంటి ఇతర కార్యకలాపాలను యథాతథంగా కొనసాగనున్నాయి. దీనిపై కంపెనీ స్పందించాల్సి ఉంది.

ఇక ఆ ప్లాంటుపై ఆధారం
దేశీయ అవసరాల కోసం అవసరమైన పూర్తి ఉత్పత్తికి ఇక నుండి హీరో కార్ప్ రాజస్థాన్లోని తపుకారా ఫెసిలిటీపై ఆధారపడనుందని తెలుస్తోంది. ప్లాంట్లో ఉత్పాదక, సామర్థ్యాన్ని పెంచేందుకు హీరో కార్స్ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ అసోసియేట్స్లో స్వచ్చంధ పదవీ విరమణ (VRS) స్కీంను ప్రవేశ పెట్టింది. గ్రేటర్ నోయిడా ప్లాంటులో సిటీ, సీఆర్-వీ, సివిక్ వంటి వివిధ మోడల్స్ను ఉత్పత్తి చేసింది. సంవత్సరానికి లక్ష యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఉత్పత్తి సామర్థ్యం
రాజస్థాన్ తపుకుర ఫెసిలిటీ ఏడాదికి 1.8 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్లాంట్ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే ఇంజిన్లను ఉత్పత్తి చేస్తుంది. HCIL నవంబర్ నెలలో దేశీయ మార్కెట్లో 9,990 యూనిట్లను విక్రయించింది. 2019 నవంబర్లో 6,459 యూనిట్లు కాగా, గత ఏడాదితో పోలిస్తే 55 శాతం పెరిగింది.

ఉద్యోగులు ట్రాన్సుఫర్
ప్రస్తుతం గ్రేటర్ నోయిడా ప్లాంట్లోని ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకోవడం లేదా రాజస్థాన్ ప్లాంటుకు ట్రాన్సుఫర్ కావడం ఉంటుంది. కరోనా మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల్లోను, కన్స్యూమర్ సెంటిమెంట్ బలహీనంగా ఉన్నప్పటికీ సేల్స్ ఆశాజనకంగా ఉన్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్, మార్కెటింగ్ అండ్ సేల్స్ రాజేష్ గోయల్ అన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications