కరోనా ఎఫెక్ట్, హెరిటేజ్ నుండి రోగనిరోధకశక్తిని పెంచే తులసి, అల్లం, టర్మరిక్ పాలు
కరోనా మహమ్మారి నేపథ్యంలో అందరూ ఇమ్యూనిటీ/రోగనిరోధకశక్తిని పెంచే ఆహార పదార్థాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వివిద కంపెనీలు రోగ నిరోధక శక్తిని పెంచే ఐటమ్స్ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి! తాజాగా చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ రోగ నిరోధక శక్తి ఫుడ్ ఐటమ్స్ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి శుక్రవారం ఆవిష్కరించారు.
హ్యాపీయెస్ట్ మైండ్స్... రూ.15వేలు ఇన్వెస్ట్ చేస్తే ఒక్కరోజులో రూ.33వేలు!
అల్లం పాలు, తులసి పాలు, టర్మరిక్ పాలు
హెరిటేజ్ అల్లం.. హెరిటేజ్ తులసి.. హెరిటేజ్ టర్మరిక్.. రకాలతో కూడిన రోగనిరోధకశక్తిని పెంచే పాలను హెరిటేజ్ ఫుడ్స్ ఆవిష్కరించింది. శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరిచేందుకు, గొంతు ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు, శరీరంలో జీవక్రియలు సజావుగా సాగి, తద్వారా రోగనిరోధకశక్తి పెరిగేందుకు ఈ పాలు దోహదపడతాయని నారా బ్రాహ్మణి అన్నారు. అన్ని రిటైల్ సేల్స్ పాయింట్స్, ఆన్ లైన్ స్టోర్స్ ద్వారా ఇవి అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. హెరిటేజ్ మొబైల్ యాప్ ద్వారా కూడా దీనిని కొనుగోలు చేయవచ్చు.
ఒక్కో సీసా ధర రూ.30
170 మిల్లీ లీటర్ల ఆకర్షణీయమైన సీసాలలో వీటిని విక్రయిస్తున్నట్లు నారా బ్రాహ్మణి చెప్పారు. ఒక్కో సీసా ధర రూ.30ని నిర్ణయించారు. ఈ పాల లైఫ్ 90 రోజులు. ఈ పాల సీసా బాటిల్స్ హెరిటేజ్ పార్లర్స్తో పాటు మోడర్న్ రిటైల్ స్టోర్స్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్, సెలెక్ట్ స్టాండలోన్ స్టోర్స్లలో లభ్యమవుతాయి.
TUCH యాప్
హెరిటేజ్ ఫుడ్స్ హెరిటేజ్ టచ్ యాప్ను కూడా ప్రారంభించింది. హైదరాబాద్లోని వినియోగదారులు పాలు, పాల పదార్థాలను ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో చాలామంది ఇంటికి పరిమితం అవుతున్నారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండి ఆర్డర్ చేయవచ్చు.ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ... ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులను ప్రారంభించినందుకు ఆనందంగా ఉందని, రోగనిరోధకశక్తిని పెంచడంలో ఉపయోగపడుతుందన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలకు కారణమైందన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎప్పుడు కూడా కస్టమర్లకు ఆరోగ్యకరమైన పదార్థాలు అందిస్తుందన్నారు. సరైన సమయంలో వినూత్న ఉత్పత్తులు తీసుకు వస్తున్నామన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకొని, విలువలతో కూడిన ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తీసుకు వస్తోందన్నారు.