HDFC బ్యాంకు ప్రభుత్వరంగ మీ-సేవతో చేతులు కలిపింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మరింత విస్తృతంగా సేవలు అందించేందుకు, వారి డోర్ స్టెప్స్కు తీసుకు వెళ్లేందుకు రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది. మీసేవ గవర్నమెంట్ టు సిటిజన్ (G2C), గవర్నమెంట్ టు బిజినెస్ (G2B) సేవలు అందిస్తోంది. ఇందులో 250కి పైగా ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు.

అన్ని రకాల సేవలు నిర్వహించుకోవచ్చు
మీ-సేవ-HDFC బ్యాంకు ఒప్పందంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4500 శాఖల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన 500కి పైగా సేవలకు సంబంధించిన అన్ని రకాల చెల్లింపులను నిర్వహించుకోవచ్చు. బ్యాంకు పేమెంట్ గేట్వేను, క్యాష్ మేనేజ్మెంట్ ద్వారా విద్యుత్, టెలిఫోన్ బిల్లులు, ఆస్తి పన్ను చెల్లింపులు, ఆధార్ వివరాలు నమోదు ప్రక్రియ, నివాసం, జనన, మరణ దృవీకరణ పత్రాలకు సంబంధించిన ఛార్జ్ను చెల్లించవచ్చు.

110 మీ సేవ కేంద్రాల నుంచి నగదు సేకరణ
ప్రభుత్వం నిర్వహిస్తున్న దాదాపు 110 మీసేవ కేంద్రాల నుండి నగదును సేకరించడం, 4,500 ఫ్రాంచైజీ మీ సేవా కేంద్రాలకు పేమెంట్ గేట్ వే సేవలను బ్యాంకు అందించడం చేస్తుంది. మీ సేవ ద్వారా ప్రతి రోజు లక్షలాది మంది సేవలు పొందుతున్నారు. నెలకు రూ.356 కోట్ల వరకు టర్నోవర్ ఉంటుంది.

ప్రతి రెండేళ్లకోసారి బ్యాంకు ఎంపిక
ప్రతి రెండేళ్లకోసారి టెండర్ ప్రక్రియ ద్వారా బ్యాంకు ఎంపిక చేస్తామని, ఇందులో భాగంగా HDFC బ్యాంకుతో అవగాహన ఒప్పందం కుదిరిందని తెలంగాణ ప్రభుత్వ ఈఎస్డీ, ఐటీఈ అండ్ సీ కమిషనర్ వెంకటేశ్వర రావు తెలిపారు. వినియోగదారులకు కావాల్సిన ఆర్థిక సేవలను అన్నీ అందించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మీ-సేవ సేవలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొందన్నారు.

మరింతమందికి చేరువయ్యేలా..
ప్రభుత్వ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించేందుకు మీసేవ కృషి చేస్తోందని, ప్రభుత్వంతో చేతులు కలపడం ద్వారా మరింత మంది ఖాతాదారులకు చేరువయ్యేందుకు వీలవుతుందని భావిస్తున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంకు సర్కిల్ హెడ్ బద్రీ విశాల్ అన్నారు. డిసెంబర్ 31, 2019 నాటికి తెలంగాణలో 222 HDFC బ్యాంకులు, 1,010 ఏటీఎంలు ఉన్నాయి.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications