దిగ్గజ ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ గురువారం (ఏప్రిల్ 21) రోజున నాలుగో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. హెచ్సీఎల్ లాభం మూడింతలు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి గాను నికర లాభం (ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్) రూ.3593 కోట్లను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన ఇది మూడు రెట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.1102 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. 2021 డిసెంబర్ త్రైమాసిక లాభం రూ.3442 కోట్లతో పోల్చినా 4.4 శాతం పెరిగింది. అన్ని విభాగాల్లో మంచి వృద్ధిని నమోదు చేసినట్లు హెచ్సీఎల్ తెలిపింది.

బలమైన వృద్ధి
ఏడాది క్రితంతో పోలిస్తే కన్సాలిడేటెడ్ ఆదాయ వృద్ధి 15 శాతం పెరిగి రూ.22,597 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఇది రూ.19,642 కోట్లుగా ఉంది. అంతకుముందు త్రైమాసికంపరంగా చూసినా రూ.22,331 కోట్లతో 1.2 శాతం పెరిగింది. ఐటీ సేవలు, ఈఆర్డీ (ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) వ్యాపారం ద్వారా ఆదాయం మరింత పెరిగినట్లు తెలిపింది.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి అంటే ఏప్రిల్-మార్చి కాలంలో నికర లాభం 21.1 శాతం పెరిగి రూ.13,499గా నమోదయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.11,145 కోట్లుగా ఉంది.

డివిడెండ్.. కొత్త ఖాతాలు
రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు పైన రూ.18 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ఈ నెల 29వ తేదీని రికార్డ్ తేదీగా నిర్ణయించింది. మే 11వ తేదీ వరకు ఈ డివిడెండ్ చెల్లింపు ఉంటుంది. ఏడాదిలో కంపెనీ రూ.44 డివిడెండ్ ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్థిర కరెన్సీలో ఆదాయ వృద్ధి 12 శాతం నుండి 13 శాతం ఉండవచ్చునని కంపెనీ పేర్కొంది. ఎబిడా మార్జిన్ 18 శాతం నుండి 20 శాతంగా ఉండవచ్చునని అంచనా వేసింది. అన్ని విభాగాల్లో కంపెనీకి కొత్త ఖాతాదారులు చేరారు.
100 మిలియన్ డాలర్ల పైబడిన విభాగంలో ఒక ఖాతాదారు, 50 మిలియన్ డాలర్ల పైబడిన విభాగంలో 8 ఖాతాలు, 20 మిలియన్ డాలర్ల పైబడిన విభాగంలో 22 ఖాతాలు, 10 మిలియన్ డాలర్ల పైబడిన విభాగంలో 30 ఖాతాలు, 5 మిలియన్ డాలర్ల పైబడిన విభాగంలో 31 ఖాతాలు, 1 మిలియన్ డాలర్ల పైబడిన విభాగంలో 73 ఖాతాలు జత కలిశాయి.

పెరిగిన ఉద్యోగులు
మార్చి త్రైమాసికం ముగిసే సమయానికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2,08,877గా ఉంది. గత త్రైమాసికంలో కంపెనీ అంతర్జాతీయంగా నికరంగా 11 వేలమంది ఉద్యోగులను నియమించుకుంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగుల సంఖ్య 39,900కు చేరుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications