కరోనా మహమ్మారి దేబ్బకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. ప్రధానంగా ఇండియాలోనైతే ఆ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. చరిత్రలో తొలిసారి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మైనస్ 23.9 శాతానికి పడిపోయింది. లాక్ డౌన్ సడలింపుల తర్వాత కూడా ఆర్థిక రంగం ఆశించిన స్థాయిలో కోలుకోలేదనడానికి నిదర్శనంగా ఆగస్టు నెలలో సైతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు బాగా తగ్గాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు మంగళవారం ప్రకటన చేసింది.
కరోనా వల్ల అన్ని రంగాలూ దెబ్బతినడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు రూ 86,449 కోట్లు మాత్రమే వచ్చాయని ఆర్థిక శాఖ తెలిపింది. గతేడాది ఇదే నెలలో రూ.98,202 కోట్లు మేర జీఎస్టీ వసూలు కాగా.. అప్పటితో పోలిస్తే 11,553 కోట్ల మేర ఆదాయం తగ్గిపోయినట్టు చెప్పింది. గతేడాదేకాదు.. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం గత రెండు నెలలతో పోల్చుకున్నా ఆగస్టులో గణాంకాలు తక్కువగా ఉండటం గమనార్హం. ఈ ఏడాది జూన్ లో రూ.90,917 కోట్లు, జులైలో 87,422 కోట్లు చొప్పున వసూలు కాగా, ఆగస్టులో మాత్రం 86,449 కోట్లు వసూలయ్యాయి.

ఆగస్టు నెలకు సంబంధించిన వసూళ్లలో కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) ద్వారా రూ.15,906 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ(ఎస్జీఎస్టీ) ద్వారా రూ.21,064 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) ద్వారా రూ.42,264 కోట్లు మేర సమకూరినట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. సెస్ల రూపంలో రూ.7215 కోట్లు వచ్చిందని తెలిపింది. రూ.5కోట్ల లోపు టర్నోవర్ కలిగిన పన్ను చెల్లింపుదారులకు రిటర్నుల ఫైలింగ్కు సెప్టెంబర్ వరకు గడువు ఉండటంతో ఈసారి వసూళ్లు తగ్గి ఉంటాయని ఆర్థిక శాఖ భావిస్తున్నది. మరోవైపు.
జీఎస్టీ వసూళ్లు నానాటికీ తగ్గిపోతూ, ఆర్థిక కష్టాలు రెట్టింపవుతోన్న దరిమిలా కేంద్ర సర్కారుపై పలు రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి. జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. జీఎస్టీ చట్టాన్ని కేంద్ర సర్కారే ఉల్లంఘిస్తున్నదని, పూర్తి పరిహారం చెల్లించాల్సిందేనని పలు రాష్ట్రాలు పట్టుపడుతున్నాయి. తెలంగాణ సహా బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్న ఐదు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ మేరకు సోమవారం సమావేశమై, కేంద్రంపై ఉమ్మడి పోరాటానికి తెరలేపారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications