కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇండియా లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించింది. రూ.1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ స్కీం పేరుతో అందిస్తోంది. వలస కార్మికులు, పేదలు, గ్రామీణ పేదలను ఆదుకునేలా దీనిని రూపొందించారు. శానిటేషన్ వర్కర్లు, ఆశా వర్కర్లు, పారామెడికల్ సిబ్బంది, వైద్యులు, నర్సులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఇన్సురెన్స్ కల్పిస్తున్నారు.

ఈపీఎఫ్ శుభవార్త.. కండిషన్స్ అప్లై
మోడీ ప్రభుత్వం పీఎఫ్ విషయంలో శుభవార్త తెలిపింది. నెలకు రూ.15,000 కంటే తక్కువ వేతనం ఉన్న వారికి 24 శాతం ఈపీఎఫ్ను కేంద్రమే భరిస్తుంది. దీనిని మూడు నెలల పాటు ఇస్తుంది. ఉద్యోగి వాటాను, యజమాని వాటాను మొత్తం కలిపి ప్రభుత్వమే జమ చేస్తుంది. అయితే 100 మంది లోపు ఉన్న ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఇది వర్తిస్తుంది. అంతేకాదు, ఇందులో 90 శాతం మంది ఉద్యోగులకు రూ.15,000 లోపు వేతనం ఉండాలి. అలాగే అత్యవసరమైతే ఈఫీఎఫ్ సబ్స్క్రైబర్లు 75 శాతం మొత్తాన్ని తీసుకోవచ్చు.

పూచీకత్తు లేకుండా రుణాలు
రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని రెండు విధాలుగా అందించనున్నట్లు నిర్మల ప్రకటించారు. పేదలకు ఆహారం లేకుండా ఉండే పరిస్థితి రానీయకుండా బియ్యం లేదా గోదుమలు రూపంలో, అలాగే మరికొంత మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదలీ ద్వారా చేయనున్నట్లు తెలిపారు. స్వయం సహాయక బృందాల రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపుతో పాటు పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తారు.

ఉపాధి హామీ వేతనాలు రూ.202కు పెంపు
ఉపాధి హామీ వేతనాలు రూ.182 నుండి రూ.202కు పెంచారు. ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా నెలకు ఒకటి చొప్పున మూడు నెలలు గ్యాస్ సిలిండర్లు. భవన నిర్మాణ కార్మికుల కోసం రాష్ట్రాలకు రూ.30వేల కోట్లు ఉపయోగించుకునే వెసులుబాటు ఇచ్చింది కేంద్రం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications