రూ.49,000 దిశగా పరుగు పెడుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు రూ.49,000 దిశగా పరుగులు పెడుతున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేటి (జనవరి 25) ప్రారంభ సెషన్లో రూ.35 పెరిగి రూ.48,599 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.33 ఎగిసి రూ.48,617 వద్ద ప్రారంభమైంది.నిన్నటి సెషన్లో అయితే భారీగా పెరిగాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో రూ.350 పెరిగి రూ.48,599 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.308 పెరిగి రూ.48,592 వద్ద ముగిసింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.7600 మాత్రమే తక్కువగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లోను 1850 డాలర్ల దిశగా కనిపిస్తోంది. కామెక్స్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్లో 1.25 డాలర్లు లాభపడి 1842.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1841 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్లో 1843.50 డాలర్ల వద్ద ప్రారంభమైంది. ఏడాదిలో 1.52 శాతం తగ్గింది. నేటి సెషన్లో 1,839.40 - 1,843.85 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.
వెండి ధరలు గతవారం భారీగా పెరిగి, ఆ తర్వాత అతి స్వల్పంగా తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ నేటి సెషన్లో రూ.50 తగ్గి రూ.64,008 వద్ద ట్రేడ్ అయింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.11 క్షీణించి రూ.64,640 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.037 డాలర్లు లాభపడి 23.837 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.