న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఇండియా లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజీని గురువారం ప్రకటించారు. రూ.1 లక్షా 70వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించడంతో పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్ యోజన కింద 80 కోట్ల మంది ప్రజలకు నెలకు 5 కిలోల బియ్యం లేదా గోదుమలు ఇస్తుంది. మూడు నెలల పాటు ఉచితంగా ఇస్తారు. అలాగే కిలో పప్పు దినుసులు ఇస్తుంది.

ప్రత్యక్ష ప్రయోజన బదలీ.. రైతులకు
నిర్మలా సీతారామన్ ప్రత్యక్ష బదలీ ప్రయోజనం కింది చర్యలను ప్రకటించారు. రైతులు, MNREGA వర్కర్స్, పేద వితంతులు, పెన్షనర్లు, వికలాంగులు, ఉజ్వల పథకం కింది మహిళలకు, స్వయం ఉపాధి మహిళలు, నిర్మాణ రంగ కార్మికులకు ఈ ప్రయోజనం ఉంటుంది.
- రైతులకు కిసాన్ బీమా యోజన కింద ఇచ్చే రూ.6,000 నగదులో మొదటి విడదను వెంటనే అకౌంట్లో వేస్తాం. దీని ద్వారా 8.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం దక్కుతుంది. రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేస్తాం.

మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్
- MGNREGA కింద వేతన రేటును పెంచడం ద్వారా ఒక్కో కార్మికుడికి అదనంగా రూ.2000 ఇస్తారు.
- ఉజ్వల కింద ఉన్న మహిళలకు వచ్చే మూడు నెలల పాటు ఉచిత గ్యాస్ సిలిండర్లు.
- కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సాయం.
- సీనియర్ సిటిజన్లు, వితంతువులు, వికలాంగులకు రూ.1000 చొప్పున మూడు నెలలు అందుతుంది. ఇది రెండు ఇన్స్టాల్మెంట్లలో వస్తుంది. దీనివల్ల 3 కోట్ల మందికి ప్రయోజనం.

జన్ ధన్ అకౌంట్లో రూ.500
- మూడు నెలల పాటు జన్ ధన్ యోజన అకౌంట్ ఉన్న మహిళల అకౌంట్లలో నెలకు రూ.500 చొప్పున ప్రభుత్వం వేస్తుంది.
- 7 లక్షల స్వయం సహాయక బృందాలకు 20 లక్షల సాయం. డ్వాక్రా మహిళలకు సాయం రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంపు.
- ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రేషన్తో పాటు కిలో కందిపప్పు ఉచితం.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications