ఫ్లిప్కార్ట్ నష్టాలు రూ.3,837 కోట్లు, 40 శాతం పెరిగిన నష్టాలు
వాల్మార్ట్కు చెందిన ఫ్లిప్కార్ట్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం నష్టాలు పెరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. 2018-19లో రూ.3,836.8 కోట్ల నష్టాన్ని ఫ్లిప్కార్ట్ మూటగట్టుకుంది. 2017-18 ఏడాదిలో నష్టం రూ.2,063.8 కోట్లుగా ఉంది. నష్టం 85.91 శాతం పెరిగిందని కార్పోరేట్ వ్యవహారాల శాఖకు వెల్లడించింది.
కార్యకలాపాలపై ఆదాయం రూ.21,657.7 కోట్ల నుంచి 42.82 శాతం వృద్ధితో రూ.30,931 కోట్లకు చేరుకుంది. ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ సేవలను ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ అందిస్తోంది. ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ నష్టాలు నష్టాలు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1,624 కోట్లుగా ఉన్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరం కంటే ఈ నష్టాలు 40 శాతం ఎక్కువ.
అమెజాన్ నష్టం రూ.5,685 కోట్లు, అమెజాన్పే నష్టం రూ.1,160 కోట్లు
ఫ్లిప్కార్ట్ ఆపరేషన్స్ కాస్ట్ 51 శాతం పెరిగాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ రూ.4,234 కోట్లుగా ఉంది. కాగా, అమెజాన్ ఇండియా నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,685 కోట్లుగా నమోదయ్యాయి.
2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.6,287 కోట్ల నష్టం కాగా, ఈ ఏడాది 9.5 శాతం తగ్గింది. అదే సమయంలో ఆదాయం 55 శాతం వృద్ధితో రూ.7,778 కోట్లకు చేరుకుంది. ఈ మేరకు బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫాం టోప్లర్ తెలిపింది. లాభాల్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఆదాయంలో మాత్రం ఊరట లభించింది.