భారత్ ఎకానమీ 'నెగిటివ్', కానీ వచ్చే ఏడాది దూసుకెళ్తుంది! రుణరేటు షాక్
కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్ సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటీవల ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారత్ రుణ రేటింగ్ను తగ్గించింది. మరో రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ గురువారం ఇండియా స్థిరత్వం నుండి నెగిటివ్కు సవరించింది. కరోనా వైరస్ - లాక్ డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపిందని పేర్కొంది. ఇప్పటికే రుణభారం కలిగిన వారిని కరోనా మరింతగా దెబ్బతీసింది. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 22 ఏళ్లలో తొలిసారి భారత్ రుణ రేటింగ్ను Baa2కు తగ్గించింది.
కరోనా ఎఫెక్ట్: కొత్త కార్లు కొనొద్దు.. ఖర్చులు తగ్గించండి! బ్యాంకులకు ఆర్థిక శాఖ హుకూం
2022లో 9.5 శాతానికి
రేటింగ్ ఏజెన్సీ భారత్ లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ ఇష్యూయర్ డిఫాల్ట్ రేటింగ్ (ఐడీఆర్)ను స్టేబుల్ నుండి నెగిటివ్ రేటింగ్ బీబీబీ-కు మార్చింది. మార్చి 25వ తేదీ నుండి విధించిన లాక్ డౌన్ కారణంగా 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఐదు శాతం క్షీణించే అవకాశముందని, అదే సమయంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతానికి పుంజుకోవచ్చునని అంచనా వేసింది. కరోనా భారత వృద్ధి దృక్పథాన్ని గణనీయంగా బలహీనపరిచిందని, అధిక రుణభారాన్ని బహిర్గతం చేసిందని పేర్కొంది.
ముందే మందగమనం
కరోనా మహమ్మారి కంటే ముందే మందగమనం కారణంగా భారత్లో వివిధ రంగాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఐతే బ్యాంకింగ్ రంగంలో అంతకుముందు కంటే రుణ భారం తగ్గింది. బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఎల్ (నాన్ ఫర్ఫార్మింగ్ లోన్) రేషియో రెండేళ్ల క్రితం 11.6 శాతం ఉండగా, 2020 ఆర్థిక సంవత్సరంలో 9.0కు తగ్గిందని ఫిచ్ రేటింగ్ అంచనా వేసింది. దీనికి ప్రధాన కారణంగా ప్రభుత్వం మూలధనం ఇంజెక్ట్ చేయడమే కారణమని పేర్కొంది.
రుణ రేటు భారీగా పెరగనుందన్న ఫిచ్ రేటింగ్
మందగమనం, కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గిందని ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రుణ రేటు 84.5 శాతానికి పెరుగుతుందని ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ అంచనా వేస్తోంది. ఇది 2020 ఆర్థిక సంవత్సరంలో 71.0 శాతంగా ఉంది. కరోనా కారణంగా వివిధ కారణాలతో సంస్థలు దెబ్బతినడం, బ్యాంకులకు సవాళ్లు, ఎన్బీఎఫ్సీలకు లిక్విడిటీ ఈష్యూ వంటి వివిధ కారణాలతో జీడీపీ వృద్ధి రేటు ప్రతికూలంగా ఉంటుందని అంచనా వేసింది.