న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరం(H1)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FPI) 15శాతం పెరిగాయి. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో గత ఏడాదితో పోలిస్తే ఈ పెట్టుబడులు పెద్ద ఎత్తున పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ కాలంలో దేశంలోకి 30 బిలియన్ డాలర్లు (2.22 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయి.
2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో 26 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఇందులో ఎక్కువగా పెట్టుబడులు మారిషస్(29 శాతం), సింగపూర్ (21 శాతం) నుండి వచ్చాయి. ఆ తర్వాత సంస్థానంలో అమెరికా, నెదర్లాండ్స్, జపాన్ 7 శాతం అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. FDIలు భారత్కు పెరగడంతో మారిషస్ నాలుగో స్థానానికి చేరింది.

ముఖేష్ అంబానీ ఎఫెక్ట్
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్లోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. విదేశీ పెట్టుబడులు పెద్ద మొత్తంలో పుంజుకోవడానికి కారణం ముఖేష్ అంబానీ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులు దోహదపడ్డాయని చెబుతున్నారు.
DPIIT గణాంకాల ప్రకారం రంగాలవారీగా చూస్తే టాప్ 10లో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సాఫ్టువేర్, హార్డ్వేర్ రంగాలు ముందున్నాయి. మిగతా 9 రంగాల్లో పెట్టుబడులు తగ్గాయి.
రాష్ట్రాలవారీగా చూస్తే గుజరాత్కు సగానికి పైగా FDIలు వచ్చాయి. ఈ రాష్ట్రానికి 16 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్ర ఉండగా, మూడో స్థానంలో కర్ణాటక ఉంది.

రంగాలవారీగా..
ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో సర్వీసుల రంగానికి 17 శాతం పెట్టుబడులు వచ్చాయి. సర్వీసుల రంగంలో ఫైనాన్షియల్, బ్యాంకింగ్, బీమా, ఔట్ సోర్సింగ్ కలసి ఉన్నాయి. ఈ రంగాల్లో కంప్యూటర్ సాఫ్టువేర్, హార్డువేర్ విభాగానికి 12 శాతం FDIలు వచ్చాయి. టెలికం రంగానికి 7 శాతం వచ్చింది. మహారాష్ట్ర 20 శాతం, కర్ణాటక 15 శాతం, ఢిల్లీ 12 శాతం చొప్పున FDIలు వచ్చాయి.
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి లిక్విడిటీని పెంచాయి. ఇదే సమయంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. దీంతో భారత్కు విదేశీ పెట్టుబడులు పెరుగుతూ వచ్చాయి. కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్, కోల్ మైనింగ్ తదితర రంగాలు భవిష్యత్తులో మరిన్ని విదేశీ పెట్టుబడుల్ని ఆకట్టుకునే వీలుంది.

అందుకే పెరిగాయి
దేశంలో FPIలకు అనువైన వాతావరణం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. జూలై-సెప్టెంబర్ కాలంలో 28.1 బిలియన్ డాలర్లకు FDIలు పెరిగాయని, మోడీపై నమ్మకం వల్ల FDIలు వెల్లువెత్తుతున్నాయని, అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత్ను గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారన్నారు. కరోనా ఉన్నప్పటికి FDIలు భారీగా పెరిగాయన్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications