ED Raids On VIVO: వరుసగా చైనా కంపెనీలు మనీలాండరింగ్ కేసుల్లో చిక్కుకుంటున్నాయి. గతంలో మెుబైల్ దిగ్గజం షియోమీ తర్వాత.. ఇప్పుడు వివో సంస్థకు చెందిన స్థావరాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. ఈ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వ ఏజెన్సీ ED విచారణ జరుపుతోంది.

అనేక రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు..
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 44 చోట్ల వివో, దాని అనుబంధ సంస్థలపై దాడులు జరుగుతున్నాయి. గతంలో మొబైల్ కంపెనీ షియోమీకి చెందిన రూ.5,551 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. చైనా స్మార్ట్ఫోన్ తయారీదారులు రాయల్టీ, పన్ను ఎగవేత పేరుతో డబ్బును దేశం నుంచి పంపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చైనా కంపెనీలపై ప్రభుత్వం విచారణను ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి వీవో కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ తో పాటు కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో దాడులు కొనసాగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఫుల్ గా సంపాదిస్తూ టాక్స్ చెల్లించకుండా..
దేశ మొబైల్ ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీలు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. వీటిలో Xiaomi, Oppo, Vivo వంటి చైనాకు చెందిన బ్రాండ్స్ ఉన్నాయి. దేశంలో ఈ కంపెనీలు రెండు చేతులా సంపాదిస్తున్నా ఒక్క పైసా కూడా పన్ను చెల్లించడం లేదు. ఈ కంపెనీల మోసాన్ని బట్టబయలు చేసేందుకు ప్రభుత్వం మల్టీ ఏజెన్సీ ప్రోబ్ ప్రారంభించింది. చాలా ఏజెన్సీలు దీనిపై విచారణ జరుపుతున్నాయి. ఈ కంపెనీలు రెగ్యులేటరీ ఫైలింగ్లు, ఇతర రిపోర్టింగ్లలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు వారి వ్యవహారశైలిపైనా ప్రభుత్వ ఏజెన్సీలు ఆరా తీస్తున్నారు.

ఆరోపణ ఏమిటంటే..
చైనా కంపెనీలు తమ ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టాయని, పన్ను ఎగవేత కోసం లాభాలను నివేదించలేదని ఆరోపణలు వచ్చాయి. భారతీయ మార్కెట్లో దేశీయ పరిశ్రమను నాశనం చేయడానికి తమ పలుకుబడిని ఉపయోగించాయని ఆరోపించారు. దీనితో పాటు ఈ కంపెనీలు ఉత్పత్తుల పంపిణీలో పారదర్శకంగా లేవని కూడా ఆరోపించాయి. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్తో చేసిన ఫైలింగ్లలో చైనా కంపెనీలు నష్టాలను చూపించాయి. ఈ సమయంలో అవి విపరీతమైన అమ్మకాలను కలిగి ఉండటంతో పాటు.. అత్యధిక ఫోన్లను విక్రయించే కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications