ప్రపంచంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఊహించని విధంగా పడింది. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టవచ్చునని, ప్రజల ప్రాణాలు మాత్రం తిరిగి నిలబెట్టలేమనే ఉద్దేశ్యంతో... కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం సుదీర్ఘ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో మన ఆర్థిక వ్యవస్థపై కూడా భారీగానే ప్రభావం పడింది. ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని, అయితే పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని ఎక్కువమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు.

ఉద్యోగాలు పెరుగుతున్నాయి.. కానీ
దేశంలో జాబ్ మార్కెట్ క్రమంగా పుంజుకున్నది. కరోనా, లాక్ డౌన్ కారణంగా భారీగా పెరిగిన నిరుద్యోగం ఆ తర్వాత జూలై నాటికి కోలుకుంది. దాదాపు ప్రీ-లాక్ డౌన్ సమయానికి చేరుకుంది. అయితే పునరుద్ధరించబడిన జాబ్ మార్కెట్ ఎక్కువగా తక్కువ వేతనం ఉన్న అనధికారిక రంగానికి చెందినవి. మెరుగైన వేతనాలు ఉన్న ఉద్యోగాల విషయానికి వస్తే పరిస్థితి మరింతగా దిగజారుతున్నట్లుగా కనిపిస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

హైశాలరీ ఉద్యోగాలు కొరత
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎంప్లాయిమెంట్ (CMIE) డేటా ప్రకారం ఏప్రిల్ 2020లో 12.5 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి. మే నెలలో ఇది 100.3 మిలియన్లకు చేరుకొని స్వల్పంగా కోలుకుంది. జూన్లో 29.9 మిలియన్లకు తగ్గింది. జూలైలో మరింత ఎక్కువగా కోలుకుంది. ఉద్యోగాలు లేని వారి సంఖ్య 11 మిలియన్లకు చేరుకుంది. గత మూడు నెలల్లో ఉద్యోగాల పునరుద్ధరణ వేగంగా జరిగింది. అయితే ఎక్కువ వేతనం ఉన్న ఉద్యోగాల పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉన్నందున ఇది వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణకు సంకేతంగా చెప్పలేమని అంటున్నారు. ఈ ఉద్యోగాల్లో పెరుగుదల కూడా కనిపించడం లేదని చెబుతున్నారు.

ఆందోళన కలిగించే అంశం..
భారత జాబ్ రివైవల్ ఆందోళన కలిగించేదిగా ఉందని CMIE ఎండీ, సీఈవో మహేష్ వ్యాస్ ఇటీవల ఓ ఆర్టికల్లో పేర్కొన్నారు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థకు కీలకమైన శాలరీ జాబ్స్ ఇంకా కోలుకోలేదని, అసంఘటిత ఉద్యోగాలతో సమానంగా కోలుకోలేదని పేర్కొన్నారు. లాక్ డౌన్ తర్వాత వేతన ఉద్యోగుల పరిస్థితి దిగజారిందని, ఏప్రిల్ నెలలో 17.7 మిలియన్లకు పైగా వేతన ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారని, జూలైలో ఈ సంఖ్య 19 మిలియన్లకు పెరిగిందన్నారు.
శాలరైడ్ ఉద్యోగాలు అంత సులభంగా పోవని, అదే సమయంలో కోలుకోవడం కూడా అంతే కష్టమని అభిప్రాయపడ్డారు. బెట్టర్ పేయింగ్ జాబ్స్ కొరత పెరుగుతోందన్నారు. అందుకే ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునే అవకాశం కనిపించడం లేదని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications