మన దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలంగా ఉన్నాయని, ప్రస్తుత మందగమనం నుంచి పటిష్టంగా పుంజుకునే సామర్థ్యం, సత్తా మనకు ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వచ్చే నెల బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన వారితో, మేధావులతో ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మందగమనం నేపథ్యంలో సూచనలు, సలహాలు కోరుతున్నారు. గురువారం ఆర్థికవేత్తలు, ప్రయివేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్టులు, బిజినెస్మెన్, వ్యవసాయ నిపుణులతో నీతి అయోగ్ కార్యాలయంలో మోడీ భేటీ అయ్యారు.

5 ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు అందరం పని చేయాలి
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్ ఆర్థిక వ్యవస్థను రెట్టింపు చేసి 5 ట్రిలియన్ డాలర్లకు (5 లక్షల కోట్ల డాలర్లు) చేర్చాలన్న దిశగా అన్ని వర్గాలు పని చేయాలని సూచించారు. మనమంతా కలిసి పని చేయాలని, అందరం ఓ దేశమన్న భావన కలిగి ఉండాలన్నారు. రెండు గంటలకు పైగా సాగిన చర్చలో నిపుణులు చేసిన సూచనలను తప్పకుండా అమలు చేస్తామని ఆర్థికవేత్తలకు హామీ ఇచ్చారు.

ఉద్యోగాలు సృష్టించే సత్తా ఉంది
5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యం హఠాత్తుగా పుట్టుకు రాలేదని, దేశ సామర్థ్యంపై అవగాహనతోనే దీనిని నిర్దేశించుకున్నట్లు మోడీ చెప్పారు. దేశాన్ని ముందుకు నడిపించేందుకు, ఉద్యోగాల్ని కల్పించేందుకు అవసరమైన సత్తా ఉందన్నారు. పర్యాటకం, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మొదలైన రంగాల్లో ఉద్యోగాలు సృష్టించవచ్చునని చెప్పారు. ఈ రంగాలను ముందుకు తీసుకు వెళ్లాలన్నారు.

ఇలా చేయండి...
ఈ సందర్భంగా నిపుణులు ప్రభుత్వానికి వివిధ సూచనలు చేశారు. రుణ వితరణ పెంచాలని, ఎగుమతుల వృద్ధి, PSB పాలన, ఉద్యోగ సృష్టి, వినియోగం పెంచే అంశంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. స్వల్పకాలంలో అమలు చేయదగ్గ సలహాలపై వెంటనే చర్యలు తీసుకుంటామని, దీర్ఘకాలంలో అమలు చేయాల్సిన వాటిని వీలును బట్టి నిర్మాణాత్మక సంస్కరణల రూపంలో తీసుకు వస్తామని మోడీ చెప్పారు.

సూచనలివ్వండి..
2020-21 బడ్జెట్పై ప్రజలు తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రధాని మోడీ కోరారు. mygov.in ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని ట్వీట్ చేశారు. 130 కోట్ల మంది ఆకాంక్షలను ప్రతిబింబించే కేంద్ర బడ్జెట్ దేశ అభివృద్ధికి దోహదపడేలా ఉంటుందని, మీరంతా ఈ సంతవ్సర బడ్జెట్కు సంబంధించి వ్యవసాయం, విద్య రంగాలపై ఆలోచనలు, సూచనలు ప్రభుత్వంతో పంచుకోండని మోడీ ట్వీట్ చేశారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications