కరోనా వైరస్ కారణంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పకపోవచ్చునని ఆ దేశ ఆధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. మనం కనబడని శత్రువుతో పోరాడుతున్నామని, నెల రోజుల కిందటి వరకు ఈ మహమ్మారి గురించే మనకు తెలియదని, ఇప్పుడు ఈ ప్రభావం ఆగస్ట్ వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని, అప్పటి దాకా కొనసాగుతుందా లేదా వెంటనే ఆగుతుందా చూడాలని, ఈ మహమ్మారి గురించి అప్పుడే ఏమీ చెప్పలేనిస్థితి అన్నారు.

ఆగస్ట్ వరకు ఆగేలా కనిపించట్లేదు
ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని, అన్నింటికీ నిధులు సమకూర్చాలని, అందువల్ల మాంద్యం తప్పనట్లుగా కనిపిస్తోందని ట్రంప్ అన్నారు. కరోనా సంక్షోభం ఆగస్ట్ వరకు కొనసాగే ముప్పు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వైరస్ కారణంగా అమెరికా మాంద్యం దిశగా అడుగులు వేస్తుందేమో కానీ ఆ తర్వాత కోలుకుంటుందన్నారు.

మార్కెట్ కాదు.. వైరస్ కట్టిపై దృష్టి
ప్రస్తుతం తాము మార్కెట్ గురించి ఆలోచించడం లేదని, వైరస్ను ఎలా కట్టడి చేయాలనే అంశంపై దృష్టి సారించామని ట్రంప్ చెప్పారు. విదేశీ ప్రయాణాలపై కట్టడి చేయడంతో విమానయాన సంస్థలు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని, ఆ రంగానికి అండగా ఉంటామన్నారు. ప్రస్తుతానికి దేశంలో కర్ఫ్యూ విధించే ఆలోచన లేదన్నారు.

ట్రంప్ మార్గదర్శకాలు
వైరస్ నేపథ్యంలో 850 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి ప్రతిపాదనలను ట్రంప్ కాంగ్రెస్ ముందు ఉంచబోతున్నారు. ఇది ట్రిలియన్ డాలర్లుగా కూడా ఉండవచ్చునని తెలుస్తోంది. తొలిసారిగా వైరస్ తీవ్రతను గుర్తిస్తూ ఆయన అమెరికన్లకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. పదిమంది కంటే ఎక్కువ మంది ఎక్కడా గుంపుగా చేరకూడదన్నారు. సామూహిక సమావేశాలకు దూరంగా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని, బయట రెస్టారెంట్లు, బార్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ సూచనలన్నీ నేటి నుండే పాటించాలని, ప్రయాణాలు వద్దని, స్కూల్స్ క్లోజ్ చేయాలన్నారు.

ఫ్రాన్స్ కీలక నిర్ణయం
కరోనా కారణంగా దివాలా ముప్పు నుండి రక్షించేందుకు తమ దేశంలోని పలు పెద్ద కంపెనీలను జాతీయం చేసేందుకు సిద్ధమని ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రూనో లె మయిర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార సంస్థలు, ఉద్యోగులకు సహాయం చేసేందుకు గాను 50 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. మరోవైపు ఇటలీలో ఇప్పటికే దివాలా తీసిన అలిటలియా విమానయాన సంస్థను తిరిగి జాతీయం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కరోనా నష్టపోతున్న కుటుంబాలు, వ్యాపార సంస్థల కోసం 25 బిలియన్ యూరోలను కేటాయించనున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications