భారత్లోని పలు నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ 5జీ సేవలను అక్టోబర్ 1న నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా 13 మెట్రో నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దీన్ని అనువుగా మార్చుకోవాలని సైబర్ నేరగాళ్లు భావిస్తున్నారు. '4జీ నుంచి 5జీకి మారాలని మేసేజ్ ల ద్వారా లింకులు పంపుతున్నారు. ఇది నిజమే అనుకుని చాలా మంది లింక్ లు క్లిక్ చేస్తే అంతే సంగతని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.

ఎయిర్ టెల్, జియో
దేశంలో ప్రధానంగా ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, జియో, బీఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థలు ఉన్నాయి. వీడియోలో ప్రస్తుతం ఎయిర్ టెల్, జియో మాత్రమే పలు నగరాల్లో 5జీ సేవలు అందిస్తోన్నాయి. ఎయిర్ టెల్, జియో సిమ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు 'ఏపీకే ఫైల్స్'ను లింకుల ద్వారా గంపగుత్తగా పంపిస్తున్నారని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

మాల్వేర్
అవి మాల్వేర్ ఫైల్స్ కావడంతో రహస్యంగా సెల్ఫోన్లోకి చొరబడతాయని హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి చొరపడితే వినియోగదారుడి ఫోన్లోని సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్లకు చిక్కుతుందని చెప్పారు. అందులో వ్యక్తిగత చిత్రాలు, ఇతర రహస్యాలున్న పక్షంలో వాటిని ఉపయోగించుకుని వాళ్లు బెదిరింపులకు దిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

సిమ్ మార్చాల్సిన అవసరం లేదు
గతంలో 3జీ నుంచి 4జీకి మారినప్పుడు సిమ్ మార్చాల్సి వచ్చేదని... ఇప్పుడా ఆవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.4జీ సిమ్పైనే 5జీ సేవలు పొందే సాంకేతికతను టెలికాం కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయని వివరించారు. సూచనలకు అనుగుణంగా సెల్ఫోన్ సెట్టింగుల్లో మార్పులు చేసుకుంటే 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications